ఈ మద్య కొంత మంది హీరోయిన్లకు ఒక్క చిత్రంతోనే బాగా కలిసి వస్తుంది.  ఫిదాతో సాయి పల్లవి, మహానటితో కీర్తి సురేష్ ఇలా యంగ్ హీరోయిన్ల అదృష్టం కలిసి వచ్చింది.  అయితే తెలుగు ఇండస్ట్రీలో ఒక లైలా కోసం, ముకుందా చిత్రాల్లో నటించిన పూజా హెగ్డెకి పెద్దగా కలిసి రాలేదు.  ఇక అల్లు అర్జున్ సరసన ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలో బిగినీతో కుర్రాళ్ల మనసు దోచిన పూజా హెగ్డెకి వెంట వెంటనే స్టార్ హీరోల సరసన ఛాన్సలు వచ్చాయి.  ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఇలా వరుస ఛాన్స్ లు కొట్టేసింది ఈ బ్యూటి. 


అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు..తాజాగా  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేసి సాక్ష్యం సినిమాలో పూజా నటించింది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ ను పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది. అయితే దీని ప్రభావం పాపం పూజా హెగ్డే పై బాగానే పడింది. ప్రభాస్ సాహో తరవాత జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్ లో చేయబోయే సినిమాకు పూజా హెగ్డేనే హీరోయిన్ గా తీసుకుకన్నారు. ఇప్పుడు సాక్ష్యం రిజల్టు చూశాక ఆ సినిమా యూనిట్ హీరోయిన్ ను మార్చే ఆలోచనలో పడిందట.

Image result for sakshyam movie

ఎందుకంటే సాక్ష్యంలో పూజా హీరోయిన్ గా ఉన్న ఆ సినిమా లో పెద్దగా ఆకర్షించుకోలేక పోయింది.  గతంలో గ్లామర్ డోస్ తో ఒక్కసారే తన రేంజ్ పెంచుకున్న అమ్మడికి మళ్లీ ట్రెడెషన్ అంటగట్టడంతో పూజాకు కాస్త దెబ్బ పడింది. జిల్ ఫేం రాధాకృష్ణ  తన తదుపరి సినిమాలో  హీరోయిన్ ను మారిస్తే ఎలాగుంటుంది అనే విషయం చర్చిస్తున్నారట.

Image result for rakul preet singh

ఈ ఛాన్స్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇండస్ట్రీల అదృష్టం ఎంత త్వరగా కలిసి వస్తుందో..బ్యాడ్ లక్ కూడా అదే రీతిలో ఎటాక్ చేస్తుంది..ఇప్పుడు పూజా హెగ్డే పరిస్థితి అలాగే తయారైందని సినీ వర్గాల టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: