తెలుగు ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి చిత్రంతో మంచి ఫామ్ లోకి వచ్చిన హీరో విజయ్ దేవరకొండ. తాజాగా విజయ్ దేవరకొండ, ఛలో ఫేమ్ రష్మిక జంటగా నటిస్తున్న ‘గీతాగోవిందం’ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు పరుశరామ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలి చిత్రం ‘యువత’ కంటెంట్ పరంగా పరవాలేదు అనిపించుకుంది..ఆ తర్వాత వచ్చిన ‘ఆంజనేయులు’ ఫ్లాప్ టాక్ వచ్చింది. ఆ తర్వాత నారా రోహిత్ ‘సోలో’ చిత్రంపై పాజిటీవ్ టాక్ వచ్చినా..రవితేజ తో తీసిన సారొచ్చారు దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఆపై ‘శ్రీరస్తు శుభమస్తు’తో మళ్లీ అతను సక్సెస్ అందుకున్నాడు ఈ దర్శకుడు.
‘శ్రీరస్తు శుభమస్తు’ తో మంచి విజయం అదుకున్న పరుశరామ్ కి గీతా ఆర్ట్స్ సంస్థ వెంటనే అతడితో మరో చిత్రానికి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక దర్శకుడు సక్సెస్ అందుకున్న వెంటనే సినిమాలు వస్తే తనపై ఎలాంటి అనుమానాలు రావు...రెండు మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకుంటే..మనోడి పని అయిపోయిందని వెంటనే టాక్ వస్తుంది.
దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకోవడంతో గీత గోవిందం’ ఇంత ఆలస్యం కావడం పట్ల చాలామందికి సందేహాలు కలిగినట్లు పరశురామ్ వెల్లడించాడు. ఇంత గ్యాప్ తీసుకోవడంతో కొన్ని విషయాల్లో నాపై నా భార్యకు కూడా అనుమానాలు వచ్చాయి. చివరికి తన భార్య కూడా తనను అనుమానించిందని అతను చమత్కరించాడు.
‘గీతాగోవిందం’ సినిమా కోసం నేను గీతా ఆర్ట్స్ కి రోజూ వెళ్తూ ఉండేవాడినికి..కానీ నాకు అప్ డేట్స్ రావడానికి చాలా టైమ్ పట్టింది. అయితే నేను రోజూ ఈ సినిమా పనిపై వేళ్తుంటే మా అవిడికు వేరే అనుమానం వచ్చేది.. ఐతే తాను స్క్రిప్టు మెరుగులు దిద్దుకోవడానికే చాలా సమయం తీసుకున్నానని పరశురామ్ చెప్పాడు. మొత్తానికి రష్మికకు గీత పాత్ర రాసి పెట్టి ఉందని.. ఆమె అద్భుతంగా ఈ పాత్రను పోషించిందని పరశురామ్ అన్నాడు.