తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య పరభాష హీరోయిన్ల హవా బాగా పెరిగిపోయింది.  తాజాగా ‘ఛలో’ తెలుగు ప్రేక్షకుల గుండెలు కొల్లగొట్టేసింది శాండల్ వుడ్ బ్యూటీ రష్మిక మండన్న.  కన్నడ సినిమా కిరిక్ పార్టీతో (తెలుగులో కిరాక్ పార్టీ) రష్మిక కెరీర్ ప్రారంభించింది. అయితే సినిమాల్లో నటిస్తూనే ఈ అమ్మడికి కోరుకున్న వరుడితో నిశ్చితార్థం కూడా జరిగింది.  మొదటి సినిమా కిరిక్ పార్టీ హీరో రక్షిత్ శెట్టితో పెళ్లికి ఓకే చెప్పేసి ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది.  తాజాగా పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘గీతాగోవిందం’ చిత్రంలో నటిస్తుంది రష్మిక. 
Image result for Geetha Govindam
ఈ సందర్భంగా హీరో విజయ్ ఆమెను వీపుపై ఎత్తుకుని మోసుకెళ్తున్న ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన కొంత మంది నెటిజన్లు నిశ్చితార్థం చేసుకున్న తర్వాత కూడా ఇలాంటి బరితెగింపు సీన్లు ఎలా చేస్తావు అంటూ  మెంట్స్ చేస్తూ..ట్రోల్ చేస్తున్నారు.   దాంతో రష్మికి ఎక్కడో కాలింది..‘మగాళ్లు పెళ్లయ్యాక కూడా వేరే హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయొచ్చు. దానికి మీకు ఎలాంటి ప్రాబ్లెం ఉండదు.
Image result for Geetha Govindam
అదే ఓ హీరోయిన్ పెళ్లయ్యాక వేరే హీరోతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తే మీరు తట్టుకోలేదు. ఆమెపై మీకున్న గౌరవం పోతుంది. ఇదే న్యాయం?’’ అంటూ రష్మిక ఎదురు ప్రశ్నించింది. ఫేక్ అకౌంట్లతో ఇష్టమొచ్చినట్టు కామెంట్ పెడతారు.

ఎందుకిలా కామెంట్ చేస్తారంటే సారీ చెబుతూ మీతో మాట్లాడాలనే అలా చేశామంటారు. అరె.. మేమూ మనుషులమే. మా ఫీలింగ్స్ హర్ట్ చేస్తే ఎలా? నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్లలో వేరే వాళ్ల ఫ్యాన్సే ఎక్కువగా ఉన్నారు. అలాంటి వాళ్లను నేను ఎంతమాత్రమే కేర్ చేయను’’ అంటోంది రష్మిక. 


మరింత సమాచారం తెలుసుకోండి: