సినీ రచయితగా తన ప్రస్థానం మొదలు పెట్టిన కొరటాల శివ తర్వాత ప్రభాస్ హీరోగా మిర్చి సినిమాతో దర్శకుడిగా మారారు.  మొదటి సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న కొరటాల తర్వాత మహేష్ బాబు తో శ్రీమంతుడు సినిమాతో మరో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.  ఆ తర్వాత ఎన్టీఆర్ తో ‘జనతాగ్యారేజ్’ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని హ్యాట్రిక్ విజయం సాధించాడు.  ఈ మద్య మహేష్ బాబు తో ‘భరత్ అనే నేను’ సక్సెస్ సాధించడమే కాదు ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేశారు. 
Image result for seaira narasimha reddy
ఈ సినిమాతో మహేష్ బాబు రెండు వందల కోట్ల క్లబ్ లో చేరిన సినిమా గా రికార్డు నమోదైంది.  ప్రస్తుతం కొరటాల శివతో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా తీయబోతున్నారని ఆ మద్య వార్తలు వచ్చాయి.   యాక్షన్ .. ఎమోషన్ కూడిన ఒక సందేశాత్మక చిత్రాన్ని ఆయన చిరంజీవితో రూపొందించనున్నాడు.  ప్రస్తుతం  చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' రూపొందుతోంది. చారిత్రక కథా నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.  ఈ సినిమా పూర్తి కాగానే కొరటాలతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ను ఆరంభించాలనుకుంటున్నారు.  ఇప్పటికే ‘సైరా’ లో నయనతార నటిస్తుంది..మరి కొరటాల శివతో తీయబోయే సినిమాకు అనుష్క .. త్రిష .. శ్రియ పేర్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ ను రంగంలోకి దింపే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: