టైటిల్ చూసి కచ్చితంగా ఇది బిగ్ బాస్ లో ఉన్న సింగర్ గీతా మాధురి గురించి అనుకునే ఛాన్స్ కచ్చితంగా ఉంది. అయితే ఈ వార్త ఆమె గురించి కాదు. బిగ్ బాస్ లో గీతా మాధురి తన ఆట తను ఆడుతూ స్ట్రాంగ్ కంటెస్టంట్ గా చేస్తూ ఉంది. ప్రస్తుతం కెప్టెన్ గా గీతా ఈమధ్యనే బాబుతో గొడవపడిన విషయం ఆమెను మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది.


ఇక మన విషయానికొస్తే.. గీత గోవిందం సినిమాలో ఆ గీత పాత్ర కోసం చాలామంది హీరోయిన్స్ ను అడిగారట. ఎవరిని అడిగినా సరే సారీ అనేశారట. మరి గీత పాత్రలో అంత స్పెషల్ ఏముందో తెలియదు కాని మొత్తానికి చాలామంది దగ్గరకు వెళ్లి ఫైనల్ గా ఛలో భామ రష్మిక మందన దగ్గరకు వచ్చి ఆగింది.


కన్నడ కిరాక్ పార్టీ సినిమా హిట్ తో సౌత్ లో సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న రష్మిక తెలుగులో ఛలో సూపర్ హిట్ కొట్టింది. నాగ శౌర్యతో ఆమె చేసిన ఈ సినిమా టాలీవుడ్ క్రేజీ బ్యూటీస్ లో ఆమెను ఒకటిగా చేసింది. ఇక గీతా గోవిందం సినిమాలో ఆ పాత్ర తన దగ్గరకు రాగానే ఓకే చెప్పిందట ఈ భామ.


నిన్న జరిగిన ఆడియో వేడుకలో దర్శకుడు పరశురాం రాసి పెట్టి ఉంది అందుకే రష్మిక చేసింది అని అన్నాడు. విజయ్, బన్నిలు కూడా రష్మిక పాత్ర గురించి ప్రస్థావించారు. మరి అంతలా ఆ పాత్రలో ఏముందో ఆగష్టు 15న సినిమా చూస్తే తెలుస్తుంది. విజయ్, రష్మికలు మాత్రం ఈ సినిమా హిట్ పక్కా అనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: