అందాల భామ తాప్సి కొంతకాలం నుంచి డానిష్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథ్యూస్ బోతో ప్రేమాయణం నడుపుతున్న గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్లు ఈ అమ్మడు ఎక్కడుంటే అక్కడకు ప్రత్యక్షమవుతుంది తాప్సి. ఆ మద్య జరిగిన తన బాయ్ ఫ్రెండ్ మ్యాచ్ కి తాప్సీ హాజరైనది. అతను పాయింట్ గెలిచినా ప్రతిసారీ నిలబడి మరీ చప్పట్లు కొట్టి ఉత్సాహపరిచిందట. ప్రియురాలు ఇస్తున్న జోష్ కి మనోడు ప్రత్యర్థిపై విజయఢంకా మోగించాడట.
ఆ తర్వాత వారిద్దరి రిలేషన్ పై మీడియా ప్రశ్నించగా 'దానిపై నేనేమి కామెంట్ చేయను' అని మాథ్యూస్ బో తప్పుకున్నాడు. ఝమ్మందినాధం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నటించింది. కానీ ఈ అమ్మడికి ఎక్కడా సరైనా హిట్స్ లేవు. ఆ మద్య తెలుగు లో ‘ఆనందో బ్రహ్మ’ చిత్రంలో నటించింది. హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
తెలుగు లో ఆదిపిని శెట్టి హీరోగా వస్తున్న ‘నీవెవరో’ చిత్రంలో నటిస్తుంది. అయితే ఇటీవల ముంబైలోని ఓ స్టార్ హోటల్ నుంచి వీరిద్దరూ చేయిచేయి కలుపుకుని బయటకు వచ్చారు. దీంతో, వీరి ప్రేమాయణంపై మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారనే వార్తలు వెలువడుతున్నాయి.
గోవాలో తాప్సీ కుటుంబసభ్యుల సమక్షంలో ఈ నిశ్చితార్థం నిరాడంబరంగా, సీక్రెట్ గా జరిగిందని చెబుతున్నారు. అయితే, ఈ వార్తలను తాప్సీ ఖండించింది. కుటుంబసభ్యులతో కలసి సరదాగా గోవా వెళ్లామని, నిశ్చితార్థంలాంటివి జరగలేదని ఆమె తెలిపింది. ఇలాంటి రూమర్లు జనాలు, మీడియా ఎలా సృష్టిస్తారో అసలు అర్ధం కాదని తాప్సీ ఫైర్ అయ్యింది.