మిస్ ఇండియా అందాల పోటీల్లో జయకేతనం ఎగురవేసి మోడలింగ్ లో రాణించిన తర్వాత సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న శోభిత ఇప్పుడు టాలీవుడ్ లోనూ అడుగు పెట్టింది. అడవి శేష్ హీరోగా నటించిన గూఢచారి సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయం అవుతోంది.  వాస్తవానికి ఈ అమ్మడు కెరీర్ తొలుత బాలీవుడ్ లోనే మొదలు పెట్టింది. అనురాగ్ కాశ్యప్ డైరెక్షన్ లో వచ్చిన రమణ్ రాఘవ్ 2.0లో ఆమె హీరోయిన్ గా నటించింది. 
Image result for శోభిత ధూళిపాళ
ఇందులో తన నటన నచ్చడంతో అడవి శేష్ తనను కలిసి గూఢచారి సినిమా ఆఫర్ చేశాడంటూ చెప్పుకొచ్చింది శోభిత. ఇందులో హార్వర్డ్ నుంచి వచ్చిన సైకాలజిస్ట్ పాత్రలో ఆమె కనిపిస్తుంది. కథలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్ నచ్చడంతో సొంత భాష తెలుగులో అడుగుపెట్టడానికి ఇదే కరెక్ట్ మూవీ అని భావించి గూఢచారి ప్రాజెక్టుకు ఓకే చెప్పానని శోభిత తెలిపింది.   మిస్‌ ఇండియా కిరీటం గెలిచిన తర్వాత నాకు చాలా కాల్స్‌ వచ్చాయి.

మా సినిమాల్లో నటించండి అంటూ చాలా మంది అడ్వాన్స్‌లు ఇవ్వడానికి రెడీ అయ్యారు. కానీ నాకు అప్పుడు నటించే ఉద్దేశ్యం లేదని చెప్పి సున్నితంగా తిరస్కరించిందని తెలిపింది. శోభిత ఇప్పటికే బాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్ హీరోగా నటించిన బ్లాక్ కామెడీ కాలాకండీలోనూ నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మితో ఓ సినిమా పూర్తి చేసింది. దీంతోపాటు మళయాళ నటుడు నివిన్ పౌలీతో మూతోన్ సినిమా చేస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: