మొన్న జరిగిన ‘గీతగోవిందం’ ఆడియో ఫంక్షన్ కు గళ్ళ లుంగీలో వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. వాస్తవానికి ఈ సినిమాకు ఆగళ్ళ లుంగీ గెటప్ కు ఎటువంటి సంబంధం లేకపోయినా పక్కా మాస్ లుక్ లో కనిపించిన విజయ్ దేవరకొండ మీడియా కెమెరాలకు హాట్ టాపిక్ గా మారాడు. అయితే ఇలా ఈక్రేజీ హీరో ఫంక్షన్ కు రావడం వెనుక ఒక కారణం ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. 
 అర్జున్‌రెడ్డి సినిమా చూసి
తెలుస్తున్న సమాచారం మేరకు విజయ్ దేవరకొండ తెలివిగా ‘గీతగోవిందం’ ఆడియో ఫంక్షన్ ను తన ‘రౌడీ బ్రాండ్’ గార్మెంట్స్ ప్రమోషన్ కు వాడుకున్నాడని కామెంట్స్ వస్తున్నాయి. రౌడీ వేర్ పేరుతో దుస్తులను మార్కెట్ చేస్తున్న విజయ్ దేవరకొండ వాటి ప్రమోషన్ కోసం సోషల్ మీడియాని విపరీతంగా వాడుతున్న విషయం తెలిసిందే. 
 శ్రీరస్తు శుభమస్తు టైంలోనే
ఈ రౌడీ వేర్ గార్మెంట్స్ లో భాగంగా విజయ్ రౌడీ లుంగీని కూడా రిలీజ్ చేశాడు. దీని ఖరీదు 1190 రూపాయలు. ఒక లుంగీకి ఏకంగా ఆస్థాయిలో ధర ఫిక్స్ చేసినా ఈయంగ్ హీరో పై ఉన్న క్రేజ్ తో యూత్ విజయ్ దేవరకొండ ‘రౌడీ గార్మెంట్స్’ ను విపరీతంగా కొంటున్నారు.  ‘గీతగోవిందం’ సినిమాకు ఈ లుంగీకి ఎలాంటి సంబంధం లేకపోయినా మొన్న జరిగిన ఫంక్షన్ కు తాను తన లుంగీ కట్టుకు వస్తానని విజయ్ ముందుగానే నిర్మాత అల్లు అరవింద్ తో చెప్పాడట. 
మనోభావాలు హర్ట్ చేయాలనే ఉద్దేశ్యం లేదు
వ్యాపార విషయాలను డీల్ చేయడంలో చాల తెలివి ఉన్న అల్లు అరవింద్ కూడ విజయ్ దేవరకొండ మాటలకు పడిపోయి ఏకంగా తన ‘గీతాగోవిందం’ ఆడియో ఫంక్షన్ ను విజయ్ రౌడీ గార్మెంట్స్ ప్రొడక్ట్స్ పబ్లిసిటీకి మార్చుకునేలా సహకరించాడా అంటూ సెటైర్లు పడుతున్నాయి. అంతేకాదు తాను ఈసినిమాలో పాడిన పాట పై వచ్చిన విమర్శలను కూడ తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఆ పాటను తనకంటే ఎవరైనా బాగా పాడేవారు ఉంటే తన పాటను తీసివేసి తన కంటే బాగా పాడినవారి పాటను పెట్టమంటూ ఏకంగా నిర్మాత అరవింద్ ను చూసి నవ్వుతూ విజయ్ దేవరకొండ చేసిన ఛాలెంజ్ ని చూసినవారు ఇతడిలో ఇగో బాగా పెరిగిపోతోంది అని విమర్శించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: