పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొన్ని రోజులుగా గ్రీన్ ఛాలెంజ్ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు మొక్కలు నాటుతూ ఒకరికొకరు ఛాలెంజ్ లు విసురుకుంటున్నారు. ఇటీవల ఎంపీ కవిత నుండి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన దర్శకుడు రాజమౌళి తెలంగాణ మంత్రి కేటీఆర్తో పాటు పుల్లెల గోపీచంద్ దర్శకుడు సందీప్ వంగా నాగ్ అశ్విన్ లకు ఛాలెంజ్ విసిరాడు.
రాజమౌళి నుండి ఛాలెంజ్ స్వీకరించిన కేటీఆర్ ప్రిన్స్ మహేష్ బాబుకు యూఎస్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డాకు ఛాలెంజ్ విసిరారు. మహేష్ బాబు తనకు కేటీఆర్ విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించడమే కాకుండా ఆ ఛాలెంజ్ ని పూర్తి చేయడంలో తన ముద్దుల కూతురు సితారను కూడ ఇన్వాల్వ్ చేసాడు. నిన్న సితారతో కలిసి మొక్కలు నాటుతున్న ఫోటోలను మహేష్ తన ట్విటర్ లో పోస్ట్ చేసాడు.
అంతటితో సరిపెట్టుకోకుండా వీరిద్దరూ కలిసి డైరెక్టర్ వంశీ పైడిపల్లికి ఈవిషయంలో ఛాలెంజ్ విశిరాడు. ఆతరువాత మహేష్ తన పిల్లలతో కలిసి పోలీసు అకాడమీకి వెళ్ళి అక్కడ అకాడమీ సిబ్బంది అదేవిధంగా అక్కడ ఉన్న ట్రైనీలతో కలిసి ఉత్సాహంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మూడువేల మొక్కలు నాటడం జరిగింది.
ఈకార్యక్రమంలో పాల్గొన్న చాలామంది అధికారులు మహేష్ తో పాటు ఉత్సాహంగా ఈకార్యక్రమంలో పాల్గొన్న సితారను చూసి తెగ ముచ్చట పడడంతో నిన్నటి కార్యక్రమానికి సితార కూడ హైలెట్ గా మారింది. కేవలం మహేష్ ఇంతటితో ఊరుకోకుండా తన అభిమానులందరూ ప్రతి ఒక్కరు 5 మొక్కలను నాటాలని పిలుపు ఇస్తే నిజంగానే మన ఉభయ తెలుగు రాష్ట్రాలు హరితవంగా మారిపోతాయి..