తెలుగుతో పాటు పలు ఇతర భాషా చిత్రాల్లో కూడా వెండితెర మెరుపులు మెరిపించింది ప్రియమణి. మాలీవుడ్ నుంచి వచ్చిన ప్రియమణి ఎన్టీఆర్ నటించిన ‘యమదొంగ’ చిత్రంలో అచ్చమైన తెలుగు అమ్మాయిగా కనిపించింది.   స్టార్ హీరోయిన్లతో పోల్చితే తక్కువ కాలమే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ.. తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకొని ప్రేక్షకుల మనసు దోచుకుంది.  ప్రియమణి కెరీర్ లో మంచి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది.  ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.

వైవాహిక జీవితం

తాజగా తన భర్తతో కలసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  అయితే ఆమె పెట్టిన ఫొటోలు, ట్యాగ్ చేసిన కామెంట్ చూసి.. ప్రియమణి ఎందుకిలా అంటోది? దాని అర్థం ఖచ్చితంగా ఆమె తల్లి కావడమే.. అని చెప్పుకుంటున్నారు నెటిజన్లు. హీరోయిన్ గా ప్రియమణి తక్కువ సమయంలో ఎక్కువ చిత్రాల్లో నటించింది. యమదొంగ, హరే రామ్ వంటి విజయవంతమైన చిత్రాలు ప్రియమణి ఖాతాలో ఉన్నాయి. కొన్ని లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లోకూడా ప్రియమణి నటించింది.

రొమాన్స్‌లో లీనమై

హీరోయిన్ గా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో ప్రియమణి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివాహం చేసుకుంది. గత ఏడాది ప్రియమణి, ముస్తఫారాజ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళైన తరువాత ప్రియమణి కెమెరాకు పూర్తిగా దూరమైపోలేదు. బుల్లి తెర షోలలో ఎంట్రీ ఇచ్చింది.ఈ ఫొటోలు పోస్ట్ చేసిన ప్రియమణి.. త్వరలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెబుతానని తెలపడం అందరిలో ఆసక్తి రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: