అక్కినేని నాగ చైతన్య హీరోగా మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు. అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా దర్శకుడు మారుతి అవడం వల్ల సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.


అంతేకాదు చైతు కెరియర్ లో ఏ సినిమాకు జరుగని ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకు జరిగింది. ఆంధ్రాలో 9 కోట్లు, సీడెడ్ లో 3.5 కోట్లు, నైజాం లో 6.5 కోట్లు బిజినెస్ చేసిన శైలజా రెడ్డి అల్లుడు రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ బిజినెస్ తో కలిపి పాతిక కోట్ల దాకా అయ్యిందట.


చైతు కెరియర్ లో ఈ రేంజ్ బిజినెస్ చేసిన సినిమా శైలజా రెడ్డి అల్లుడే. రారండోయ్ వేడుక చూద్దాం చైతు కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా టోటల్ కలక్షన్స్ 25 కోట్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఆ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు.


ఆగష్టు 1న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నారు. మహానుభావుడు సినిమా తర్వాత మారుతి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అజ్ఞాతవాసి, నా పేరు సూర్య నిరాశ పరచడంతో అను ఇమ్మాన్యుయెల్ కు ఈ సినిమా హిట్ చాలా అవసరం. మరి అమ్మడికి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: