మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ షూటింగ్ కు ప్రభుత్వ అనుమతులు లేవు అంటూ ఆమూవీకి సంబంధించిన సెట్స్ ను రెవిన్యూ అధికారులు తొలిగించారు అని వస్తున్న వార్తలు షాకింగ్ న్యూస్ గా మారాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ షూటింగ్ కోసం శేరిలింగంపల్లి రెవిన్యూ డివిజన్ పరిధిలో ఒక భారీ సెట్ ను ‘సైరా’ టీమ్ నిర్మించినట్లు సమాచారం. 
Chiranjeevi's Birthday Gift To You - Motion Poster Of Sye Raa Narasimha Reddy
ఇదే ప్రదేశంలో గతంలో ఒక భారీ సెట్ వేసి రామ్ చరణ్ ‘రంగస్థలం’ షూటింగ్ కూడ జరిగింది. ఇప్పుడు అదే ప్రాంతంలో ‘సైరా’ కు కూడ సెట్ వేసి షూటింగ్ కు రెడీ పెట్టారు. అయితే రెవిన్యూ అధికారులు మాత్రం ఈ కొత్త సెట్ కు ప్రభుత్వ అనుమతులు లేవని తాము గతంలో రంగస్థలం షూటింగ్ కు ఇచ్చిన అనుమతులు ‘సైరా’ కు పనికిరావు అని అంటూ షూటింగ్ ల నిమిత్తం ఇలా ల్యాండ్ ను అనుమతులు లేకుండా వాడుకుంటూ పోతే అది కబ్జా కింద మారుతుందని అధికారులు గట్టిగా ‘సైరా’ టీమ్ కు అడ్డు తగిలినట్లు టాక్.  
Amitabh bachchan look in Narasimha Reddy
ఇప్పటికే ఈ ల్యాండ్ కు సంబంధించిన వివాదం కోర్టు పరిధిలో ఉన్న నేపధ్యంలో ఇలా షూటింగ్ లు కొనసాగిస్తే సమస్యలు వస్తాయి అన్న ఉద్దేశ్యంతో రెవిన్యూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రకరకాల కారణాలతో ఈమూవీ షూటింగ్ చాల ఆలశ్యంగా జరుగుతున్న నేపధ్యంలో ఈకొత్త అడ్డంకి మెగా కాంపౌండ్ కు ఊహించని షాక్ గా మారింది అని అంటున్నారు.

దీనితో త్వరలో యూరప్ షూటింగ్ కోసం వెళ్ళనున్న ‘సైరా’ యూనిట్ ఈలోపునే మరోచోట మరో సెట్ వేసి ఈమూవీ షూటింగ్ ను కొనసాగిస్తారా లేదంటే యూరప్ నుంచి తిరిగి వచ్చాక మాత్రమే ఈవిషయాలు ఆలోచిస్తారా అన్న విషయం ప్రస్తుతానికి సస్పెన్స్. చిరంజీవితో పాటు చరణ్ కూడ ఈమూవీ షూటింగ్ ను వేగంగా పూర్తిచేయాలి అని ప్రయత్నిస్తుంటే వర్షం ఒకసారి ప్రభుత్వ అనుమతులు మరొకసారి ఇలా రకరకాల కారణాలు ‘సైరా’ శాపంగా మారడం నిజంగానే ఊహించని విషయం..  


మరింత సమాచారం తెలుసుకోండి: