సూపర్ స్టార్ మహేష్ సరసన భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటించిన భామ కియరా అద్వాని ప్రస్తుతం ఓ హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉందని లేటెస్ట్ టాక్. ముంబై మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం లస్ట్ స్టోరీస్ తో బాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన కియరా అద్వాని అక్కడ ఓ హీరో ప్రేమలో పడ్డదట.


భరత్ తర్వాత ఆ ప్రొడక్షన్ లోనే రాం చరణ్ తో సినిమా చేస్తున్న కియరా తెలుగులో టాప్ హీరోయిన్ అయ్యేలా కనిపిస్తుంది. మరో పక్క బాలీవుడ్ రొమాంటిక్ హీరో సిద్ధార్థ్ మల్ హోత్రాతో ప్రేమలో పడ్డదట కియరా అద్వాని. ఇంతకుముందు అలియా భట్ తో ఎఫైర్ నడిపినట్టు వార్తలు రాగా ఆమెను వదిలి కొన్నాళ్లు జాక్వెలిన్ తో తిరిగాడు.


ఇప్పుడు లేటెస్ట్ గా కియరాతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నాడట సిద్ధార్థ్. ఈమధ్యనే అమ్మడు బర్త్ డేకు సిద్ధార్థ్ రావడం ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది. ఇటు సౌత్ అటు నార్త్ లో బాగా పాపులర్ అయిన కియరా రానున్న రోజుల్లో బాలీవుడ్ ను షేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. లస్ట్ స్టోరీస్ లో ఆమె ఎక్స్ ప్రెషన్స్ కు ఫ్యాన్స్ అంతా ఫిదా అయ్యారు.


ఇక తెలుగులో చరణ్ సినిమా కాగానే మరో రెండు క్రేజీ ఆఫర్లు లైన్ లో ఉన్నాయట. మహేష్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ వస్తే తమిళంలో కూడా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యింది. మరి కెరియర్ మంచి ఫాంలో ఉండగా ప్రేమ దోమా అంటూ ట్రాక్ తప్పకుండా అమ్మడు ఫోకస్ పెడితే మాత్రం టాప్ రేంజ్ కు వెళ్తుందని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: