తెలుగు ఇండస్ట్రీలో విప్లవ డైరెక్టర్ టి.కృష్ణ తనయుడు గోపిచంద్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి చిత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. తర్వాత   జయం, వర్షం, నిజం చిత్రాల్లో విలన్ గా నటించి హీరో రేంజ్ లో మెప్పించాడు.  ఆ తర్వాత హీరోగానే కొనసాగుతూ..ఎన్నో యాక్షన్ తరహా చిత్రాల్లో నటించాడు.  అయితే ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ కూడా చాలా అవసరమని భావించిన ఆయన, యాక్షన్ కి ఎమోషన్ చిత్రాల్లో నటించడం మొదలు పెట్టాడు.ః

 ఆ నేపథ్యంలో వచ్చిన చిత్రాలే లౌక్యం, సౌఖ్యం చిత్రాలతో ఆకట్టుకున్నాడు.  ఆ తరహా చిత్రాలు కొద్ది కాలం వరకే వర్క్ ఔట్ అవుతాయని గ్రహించిన గోపిచంద్ మళ్లీ యాక్షన్ తరహా చిత్రాలకు ప్రాదాన్య ఇచ్చాడు. కానీ ఈ తరహా సినిమాలు చేసినా ఆయనకి సరైన హిట్ పడటం లేదు. వరుస పరాజయాలు ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన రూట్ మార్చి కొత్తదనం చూపించాలనే నిర్ణయానికి వచ్చేశాడు. తాజాగా నూతన దర్శకుడు కుమార్ దర్శకత్వంలో ఓ థ్రిలర్ చిత్రంలో నటించడానికి సిద్దం అయ్యాడు.ఈ నెలలో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి .. నవంబర్ లో సినిమాను పూర్తిచేయాలనే ఆలోచనలో వున్నారు. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది.    



మరింత సమాచారం తెలుసుకోండి: