తెలంగాణలో హరిత హారం ఛాలెంజ్కు మంచి స్పందన లభిస్తోంది. కల్వకుంట్ల కవిత, కేటీఆర్, సచిన్, లక్ష్మణ్, మహేశ్ బాబు లాంటి ప్రముఖులు ఇప్పటికే గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటారు. నిన్న ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి విసిరిన హరిత ఛాలెంజ్కు మెగాస్టార్ స్పందించారు. ఎన్టీవీ చౌదరి గారు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరిస్తూ... ఈరోజు మా ఇంటి పెరట్లో నేను మూడు మొక్కలు నాటడం జరిగింది.
తర్వాత చిరంజీవి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లకు చిరంజీవి హరిత సవాల్ విసిరారు. అన్నయ్య ఇచ్చిన ఛాలెంజ్ పవన్ కళ్యాన్ స్వీకరించి జనసేన కార్యాలయంలో మొక్కలు నాటారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్, రాచకొండ పోలీసుల గ్రీన్ ఛాలెంజ్ ను హీరో మహేష్ బాబు పూర్తి చేసి, మరో ముగ్గురిని నామినేట్ చేసిన విషయం తెలిసిందే.
ఆ ముగ్గురిలో మహేష్ పిల్లలు సితార, గౌతమ్, దర్శకుడు వంశీ పైడిపల్లి ఉన్నారు. మహేష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి పూర్తి చేశారు.సితార ఓ మొక్క నాటి, నీళ్లు పోసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన హరితహారం కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ వీడియోని మహేష్ బాబు తన యూ ట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు.