ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా గ్రీన్ ఛాలెంజ్ జోరందుకుంది.  ఇప్పటికే సెలబ్రెటీలు ఒకరికొకరు గ్రీన్ ఛాలెంజ్  విసురుతున్నారు.  గ్రీన్ ఛాలెంజ్ కి స్పందిస్తూ..మూడు చెట్లు నాటుతున్నారు.  అయితే తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు తన కుటుంబ అంటే ఎంతగానో ఇష్టపడతాడు.  వ‌ర్క్‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా భార్య పిల్ల‌ల‌తో స‌ర‌దాగా స‌మ‌యం గడుపుతుంటాడు.
Related image
షెడ్యూల్ బ్రేక్స్‌లో స‌ర‌దాగా విహార యాత్రలకి వెళుతుంటాడు. అప్పుడప్పుడు త‌న పిల్ల‌ల‌కి సంబంధించిన విష‌యాల‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు.  ఇటీవ‌ల కేటీఆర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన మ‌హేష్ ఓ మొక్క నాటి అదే ఛాలెంజ్‌ని తన కూతురు సితారకు, కొడుకు గౌతమ్‌కి, డైరెక్టర్ వంశీ పైడిపెల్లికి విసిరారు.

ఇందులో భాగంగా మ‌హేష్ పిల్ల‌లు ఇద్దరు సితార‌, గౌత‌మ్‌లు చెట్లు నాటారు.  దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  తి ఒక్క‌రు హ‌రిత‌హ‌రంలో భాగం కావాల‌ని, భ‌విష్య‌త్ అంతా ప‌చ్చ‌ద‌నంతో వ‌ర్ధిల్లాల‌ని కోరాడు. మ‌హేష్ షేర్ చేసిన వీడియో గంట‌లోనే 13,500 మంది వీక్షించ‌డం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: