దక్షిణాది చిత్ర పరిశ్రమలో శృంగార తారగా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన షకీలా 250 చిత్రం ‘శీలవతి’. 'జీ' స్టూడియోస్ సమర్పణలో రాఘవ ఎమ్ గణేష్, వీరు బాసింశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయిరామ్ దాసరి దర్శకత్వం వహిస్తున్నారు.కేరళలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చితం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఆగస్ట్ 17 న విడుదల కాబోతుంది.
Shakila
ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ “నా 250వ చిత్రమైన ఇది నాకు చాలా స్పెషల్. ఇందులో చాలా ముఖ్యమైన పాత్రలో నటించాను. నెక్స్ సీన్ ఏంటి అనే ఉత్కంఠ కలిగేలా దర్శకుడు సినిమాను తెరకెక్కించారు. ఈనెల 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది”అని అన్నారు.  నిర్మాతలు రాఘవ ఎమ్ గణేష్ మరియు వీరు బాసింశెట్టి మాట్లాడుతూ.. "సెన్సార్ ట్రబుల్స్‌ని ఎదుర్కొని సక్సెస్‌ఫుల్‌గా ఆగస్ట్ 17న 'శీలవతి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము.

దర్శకుడు సాయిరామ్ దాసరి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా చూశాక ఇంతకు ముందు షకీలా వేరు ఈ సినిమా తర్వాత షకీలా వేరు అని అందరూ అంటారు”అని తెలిపారు. షకీలా, అర్జున్(జబర్దస్త్), గీతాంజలి (ఫ్రూటీ), అశోక్, కొండ, తిరుపతి, చిన్నా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: ప్రజ్వల్ క్రిష్, డిఓపి: తరుణ్ కరామ్ తోత్, ఎడిటర్స్: శ్రీనివాస రాజలింగు, కె ఆర్. స్వామి, నిర్మాతలు: రాఘవ ఎమ్ మహేష్, వీరు బాసింశెట్టి, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: సాయిరామ్ దాసరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: