ఈ నెలాఖరకు విడుదల కాబోతున్న ‘శైలజా రెడ్డి’ ఫలితం పై నాగచైతన్య ఎన్నో అంచనాలు పెంచుకున్నాడు. ఈమూవీకి ఇప్పటికే ప్రీరిలీజ్ పాజిటివ్ టాక్ వచ్చిన నేపధ్యంలో ఈమూవీకి అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ కూడ జరిగింది. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీ గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్ని కీలక కామెంట్స్ చేసాడు అని వస్తున్న వార్తలు నాగచైతన్యను తీవ్రస్థాయిలో కలవర పెడుతున్నట్లు టాక్.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ రఫ్ కట్ వర్షన్ ను లేటెస్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసినిమాను నిర్మించిన రాథా కృష్ణ దర్శకుడు మారుతితో కలిసి చూసినట్లు సమాచారం. ఈమూవీ ఫైనల్ అవుట్ పుట్  చూసిన తరువాత నిర్మాత రాథా కృష్ణ ఈసినిమా చాల అద్భుతంగా వచ్చిందని క్లైమాక్స్ కూడ చాల బాగా వచ్చిందని కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
naga chaitanya role in sailaja reddy alludu revealed
అయితే ఈమూవీని చూసిన తరువాత త్రివిక్రమ్ ఏమి మాట్లాడకుండా చిరునవ్వులు చిందిస్తూ మౌనం వహించడంతో త్రివిక్రమ్ కు ఎంతో ఆత్మీయుడైన నిర్మాత రాథా కృష్ణ ఈమూవీ పై త్రివిక్రమ్ ను తన అభిప్రాయాన్ని చెప్పమని అడిగినట్లు తెలుస్తోంది. దీనితో రాథా కృష్ణ ఒత్తిడి తట్టుకోలేక త్రివిక్రమ్ కామెంట్ చేస్తూ మరొక దర్శకుడు చేసిన వర్క్ పై తాను లోతుగా కామెంట్ చేయడం బాగుండదని మౌనం వహించాను అని అంటూ వ్యూహాత్మకంగా కామెంట్ చేసినట్లు టాక్. 
Naga Chaitanya Sailaja Reddy Alludu movie release date
దీనితో త్రివిక్రమ్ కు ‘శైలజా రెడ్డి’ మూవీ నచ్చలేదా అంటూ గాసిప్పులు మొదలైపోయాయి. మారుతి దర్శకత్వం వహించడమే కాకుండా ఈసినిమాకు సంబంధించిన కథను డైలాగ్స్ ను కూడ వ్రాసాడు. సుమారు 20 కోట్ల భారీ ఖర్చుతో 35 కోట్ల స్థాయిలో బిజినెస్ జరిగిన ఈమూవీ బయ్యర్లకు త్రివిక్రమ్ ఈమూవీని చూసి  మౌనం వహించాడు అని వస్తున్న వార్తలు కలవరపాటు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈవిషయం నాగచైతన్య వరకు చేరడంతో చైతూ కూడ మాటల మాంత్రికుడు మౌనం వెనుక అర్థాలు ఏమిటి అని టెన్షన్ గా ఉన్నట్లు సమాచారం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: