తెలుగు ఇండస్ట్రీలోకి ఏం మాయ చేసావే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత మొదట్లో గ్లామర్ తరహా పాత్రల్లో నటించింది.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిన సమంత తన సహనటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.  అయితే పెళ్లైన తర్వాత నమంత నటనకు గుడ్ బాయ్ చెప్పబోతుందని రక రకాల వార్తలు వచ్చాయి. కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగ స్థలం’, విశాల్ సరసన ‘అభిన్యుడు’ సినిమాలతో అద్భుత విజయాలు అందుకుంది. 
Image result for samantha rangasthalam
ఇక రంగస్థలం చిత్రంలో రామలక్ష్మిగా డి గ్లామర్ పాత్రలో నటించిన సమంత విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది.  ఇక పెళ్లైన తర్వాత ఎక్కువ శాతం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తానంటుంది సమంత.  విభిన్నమైన కథలను ఎంచుకుంటూ..సమంత వరుస విజయాలను అందుకుంటోంది.  తాజాగా సమంత మరో వైవిధ్యభరితమైన కథాంశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. గత కొంత కాలంగా దర్శకురాలు నందినీ రెడ్డి-సమంతకు మద్య  కొన్ని రోజులుగా కథా చర్చలు జరుగుతున్నాయట.

ఇది 2014లో వచ్చిన కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి రీమేక్ అని అంటున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారి 70 యేళ్ల వృద్ధురాలిగా కనిపిస్తూ ఉంటుంది. అతీత శక్తులను కలిగిన ఆమె అవసరమైనప్పుడు యవ్వనవతిగా మారిపోతూ ఉంటుంది. అలాంటి పాత్రలో సమంతను చూపించాలనే ఉద్దేశంతోనే నందినీ రెడ్డి ఉన్నారట.  సమంతకు ఒకే అయితే..ఈ చిత్రంలో నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: