తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ బెల్లం కొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  మొదటి సినిమా స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటించింది.  ఇక ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం లాంటి సీనియర్ హీరోలతో నటించి మనోడికి అన్నీ ప్లస్ అయ్యాయి.  కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ తో ‘అల్లుడు శీను’ కమర్షియల్ హిట్ అయ్యింది.  ఆ తర్వాత వచ్చిన స్పీడున్నోడు అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  మాస్ దర్శకులు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘జయ జానకీ నాయక’ కూడా యావరేజ్ హిట్ అయ్యింది.
Image result for saakshyam movie
శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ ..  పూజా హెగ్డే జంటగా రూపొందిన 'సాక్ష్యం'.  మొదటి నుంచి ఎన్నో అంచనాలతో ఈ చిత్రం గత నెల  నెల 27వ తేదీన థియేటర్స్ కి వచ్చింది. పంచభూతాల నేపథ్యంలో నడిపించిన ఈ కథకి ప్రేక్షకుల ఆదరణ లభించింది.  ఆడియన్స్ ను మెప్పించడంలో దర్శకుడు శ్రీవాస్ సక్సెస్ అయ్యాడు.
Image result for saakshyam movie
భారీ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ చిత్రం .. ప్రస్తుతం థియేటర్స్ లో అదే జోరును కొనసాగిస్తోంది. శాటిలైట్ .. డిజిటల్ రూపంలో 12 కోట్ల వరకూ  వచ్చాయి.  ఈ చిత్రం రూ40 కోట్లతో నిర్మించబడింది. అయితే  తొలి నాలుగు రోజుల్లోనే 40 కోట్ల గ్రాస్ ను రాబట్టేసిందని చెబుతున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ కి మాస్ లో మంచి క్రేజ్ వుంది. ఇక గ్లామర్ పరంగా పూజా హెగ్డేకి ఒక రేంజ్ లో ఇమేజ్ వుంది. వీటికి తోడు దర్శకుడు శ్రీవాస్ ఎంచుకున్న కథ, కథనాన్ని నడిపించిన తీరు ఈ స్థాయి వసూళ్లకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: