ముకుంద, ఒక లైలా కోసం సినిమాల తర్వాత బాలీవుడ్ మొహెంజోదారో సినిమాలో హృతిక్ పక్కన నటించిన పూజా హెగ్దె అక్కడ ప్రేక్షకులు తనని గుర్తించలేదని గ్రహించి తెలుగులోనే మళ్లీ సినిమాలు చేస్తుంది. బన్ని డిజే సినిమాతో బికినివేసి యువత మనసు గెలిచిన పూజా హెగ్దె రీసెంట్ గా సాక్ష్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాక్ష్యం. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో నామా అభిషేక్ నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దె నటించింది. పంచభూతాల కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో అమ్మడు కేవలం స్కిన్ షోకి మాత్రం అన్నట్టు కనిపించింది.  


ఓ పక్క ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత, మహేష్ తో 25వ సినిమా చేస్తున్న పూజా హెగ్దె సాక్ష్యంతో బెల్లంకొండ బాబుతో ఎలా చేసింది అన్నది డౌట్ గా మారింది. అయితే సాక్ష్యం సినిమా మరో బాహుబలి అని చెప్పి పూజాని ఒప్పించారట. అంతేకాదు సినిమాలో ఆమె లుక్ ఎందుకో అంత బాగాలేదు. తనపై కేర్ తీసుకోలేదని అంటుంది ఈ చిన్నది.  


సాక్ష్యం సినిమాలో తనని మోసం చేశారని అంటుంది అమ్మడు. సినిమాతో తన ఇమేజ్ రెట్టింపు అవుతుందన్న ఆలోచనతో ఈ సినిమా ఒప్పుకుందట. అయితే సినిమా చేసిందుకు పూజా కోటిన్నర దాకా రెమ్యునరేషన్ తీసుకుంది. మరి అమ్మడికి ఒక ఫ్లాప్ పడినా రెమ్యునరేషన్ మాత్రం భారీగా వచ్చినట్టే అంటున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: