సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ లాండ్ మార్క్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ లోగోను ఈ రోజు సాయంత్రం ఇద్దరు ముఖ్య అతిధులు రిలీజ్ చేశారు. ఆ అతిధులు ఎవరో కాదు మహేష్ బాబు కూతురు సితార, చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్య. ఈ ఇద్దరు చిన్నారులూ కలసి పంచుకున్న ఈ కార్యక్రమం సూపర్ స్టార్ మహేష్ కొత్త హిట్ కి సై అంది.

ఈ నెల 9న మహెష్ పుట్టిన రోజు. ఆ రోజున అభిమానుల కోసం ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్  చేస్తోంది. కొత్త లుక్ లో మహేష్ బాబు  గడ్డం మీసాలతో అదరగొట్టేలా ఉన్నాడని టాక్. భరత్ అను నేను సూపర్ హిట్ తరువాత మహేష్ నటించే చిత్రం కావడం. పైగా 25వ మూవీ కావడంతో అటు అభిమానులలోనూ ఇటు సినీ జనాలలోనూ అంచనాలు  బీభత్సంగా ఉన్నాయి. సో ఫాన్స్ తో పాటు సినీ ప్రియులంతా  ఆగస్ట్ 9 కోసం వైట్ చేయాల్సిందే. అపుడే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కూడా.



మరింత సమాచారం తెలుసుకోండి: