తెలుగులో జేమ్స్ బాండ్ తరహా సినిమాలు చాలా అరుదు. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గూఢచారి116 సినిమా చేసి మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాడు. ఇక ఆ తర్వాత కృష్ణ వారసుడిగా మహేష్ వంశీ సినిమాను అదే గూఢచారి తరహాలో సినిమా చేశాడు. కాని అది వర్క్ అవుట్ కాలేదు.


ఈమధ్య రిలీజ్ అయిన అడివి శేష్ గూఢచారి తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. సినిమా ఇప్పటికే మంచి ఫలితాన్ని అందుకోగా సినిమాపై ప్రేక్షకులే కాదు సిని ప్రముఖులు కూడా పాజిటివ్ స్పందిస్తున్నారు. ఇక ఈ సినిమా నిర్మాత అభిషేక్ నామా గూఢచారిపై ఉంచిన నమ్మకం చాలా గొప్పది.


ముందు డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న అభిషేక్ నామా ఆ తర్వాత అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తున్నారు. సాక్ష్యం, గూఢచారి అభిషేక్ పిక్చర్స్ లో వచ్చిన సినిమాలే. సాక్ష్యం భారీ బడ్జెట్ తో వచ్చినా అంతగా ఆకట్టుకోలేదు. ఇక గూఢచారి మాత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు అభిషేక్ మరో క్రేజీ ప్రాజెక్ట్ గా వారణాసి బ్యాక్ డ్రాప్ లో ఓ లవ్ స్టోరీ చేస్తున్నాడట. 


సినిమా మొత్తం వారణాసిలోనే ఉంటుందట. ప్రవీణ్ కుమార్ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. యువ హీరో ఒకరు ఇందులో నటిస్తాడని అంటున్నారు. గాయం-2, కాళీచరణ్ సినిమాలను డైరెక్ట్ చేసిన ప్రవీణ్ ఈసారి క్రేజీ అటెంప్ట్ తో వస్తున్నాడట. అందమైన లొకేషన్స్ లో ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందో చూడాలి.      


మరింత సమాచారం తెలుసుకోండి: