అక్కినేని హీరోలకు ఈమధ్య లక్ బాగుందని చెప్పొచ్చు. సుమంత్ మళ్లీ రావాతో హిట్ అందుకోగా సుశాంత్ కూడా చిలసౌ అంటూ వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా సింపుల్ కథతో అదేవిధమైన కథనంతో వచ్చి హిట్ అందుకుంది.


ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే చిలసౌ డైరక్టర్ రాహుల్ రవింద్రన్ మరో అక్కినేని హీరో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. నాగ చైతన్య హీరోగా ఈ సినిమా వస్తుందట. సినిమా అయితే కన్ఫాం చేశాడు కాని ఇప్పుడప్పుడే ఆ సినిమా ఉండేట్టు కనబడట్లేదు. ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా శైలజా రెడ్డి అల్లుడు రిలీజ్ అవుతుంది.  


మరోపక్క చైతు చందు మొండేటి కాంబినేషన్ లో సవ్యసాచి కూడా వస్తుంది. ఈ రెండు సినిమాలే కాదు వెంకటేష్ తో ఓ సినిమా లైన్ లో ఉండగా శివ నిర్వాణ డైరక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఒకటి పూర్తయ్యాక కాని రాహుల్ రవింద్రన్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు.


మారుతి డైరక్షన్ లో శైలజా రెడ్డి అల్లుడు ఈమధ్యనే టీజర్ రిలీజ్ అయ్యి ఇంప్రెస్ చేసింది. ఆగష్టు 31న ఈ సినిమా రాబోతుంది. ఇక సవ్యసాచి సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయలేదు. బాబి డైరక్షన్ లో వెంకటేష్ తో చేస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి.    



మరింత సమాచారం తెలుసుకోండి: