ప్రభాస్ ‘సాహో’ నిర్మాణం పూర్తి కాకుండానే అతిత్వరలో మరో సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ‘జిల్’ రాథా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈమూవీ ఒక ప్రేమ కథ అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. ఈమూవీ కథ కొంత భాగం 1940 బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని తెలుస్తోంది.
radha krishna and prabhas movie goes on floors
ప్రేమ కథగా డిజైన్ చేయబడుతున్న ఈమూవీ విషాదాంతంతో ముగిస్తుందని తెలుస్తోంది. అంతేకాదు ఈమూవీని చూసిన వారికి అక్కడక్కడా నాగార్జున మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన ‘గీతాంజలి’ కథ గుర్తుకు వస్తుందని సమాచారం. ఈమూవీ క్లైమాక్స్ లో ప్రభాస్ పాత్ర చనిపోతుందని లీకులు వస్తున్నాయి. 
Prabhas
ఇప్పుడు ఈవార్తలు ఇలా వైరల్ కావడంతో ప్రభాస్ ఇలాంటి ప్రయోగం ఎందుకు చేస్తున్నాడు అంటూ ప్రభాస్ అభిమానులు మధన పడుతున్నట్లు టాక్. దీనికి కారణం ప్రభాస్ గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘చక్రం’ సినిమా చివరిన చనిపోయినట్లుగా చూపించినట్లుగా చూపించినప్పుడు ప్రభాస్ అభిమానులు కూడ తట్టుకోలేక పోవడంతో ఆమూవీ ప్రభాస్ కెరియర్ లో అత్యంత భయంకరమైన ఫ్లాప్ గా మారింది. 
Radhakrishna
‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ అత్యంత భారీ సినిమాలు చేయాలి కానీ ఇలా విషాదాంత ప్రేమ కథలలో నటిస్తే ప్రభాస్ కు ఏమి కలిసి వస్తుంది అంటూ అభిమానులు తమ ఉద్దేశ్యాలను ఈమూవీని నిర్మిస్తున్న కృష్ణంరాజుకు చేరే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే ‘సాహో’ లాంటి భారీ సినిమాను సుజిత్ లాంటి ఒక యంగ్ డైరెక్టర్ చేతిలో పెట్టి ప్రయోగాలు చేస్తున్న ప్రభాస్ అది చాలదు అన్నట్లుగా ఇప్పుడు ఇలా ‘గీతాంజలి’ ప్రయోగాలు చేస్తే ప్రస్తుత తరం యూత్ కనెక్ట్ అవుతారా అన్న సందేహాలు ప్రభాస్ అభిమానులను విపరీతంగా వెంటాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: