తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ షో రోజు రోజుకీ మరింత ఆసక్తి పెంచుతుంది. ప్పటికే సగం భాగాన్ని ముగించుకున్న ఈ షో.. రోజురోజుకు ఆసక్తికరంగా, అనూహ్య మలుపులతో ఆకట్టుకుంటోంది. దీంతో ప్రేక్షకులు సైతం ఒక్కసారిగా పెరిగారు. పోటీదారులకు మద్దతుగా వస్తున్న ఓట్లను చూస్తుంటే ఈ విషయం అర్థం అవుతోంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌజ్ నుంచి వెళ్లినవారు సంజన, నూతన్ నాయుడు, కిరీటి, శ్యామల, భానుశ్రీ, తేజస్వి. అయితే ఇందులో గతంలో బిగ్ బాస్ నుంచి ఎలిమినేషన్ అయిన వారు నూతన్ నాయుడు, శ్యామల ఓటింగ్ ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌజ్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పూజ రామచంద్రన్ ఎంట్రీ ఇచ్చింది. నిన్న ఆదివారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ముఖ్యంగా ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా గతంలో వారి జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాలు షేర్ చేసుకున్నారు. అయితే నిన్న నాని చేసిన అల్లరి పని బిగ్ బాస్ హౌజ్ సభ్యులకు ఆశ్చర్యం కలిగించింది.
హౌస్లోకి వెళ్లిన తర్వాత నానిని టీవీలో మాత్రమే చూస్తున్న పోటీదారులు నిన్న సడెన్గా ప్రత్యక్షంగా అతడిని చూసేసరికి కేరింతలు కొట్టారు. వారికి విషెస్ చెప్పేందుకు నాని ఏకంగా గోడ ఎక్కి మరీ విష్ చేశాడు. చూసిన హౌస్మేట్స్ కిందికి దూకేయాలంటూ గొడవ చేశారు. అయితే, అలా రాకూడదని చెప్పిన నాని విషెస్ చెప్పిన అనంతరం వెళ్లిపోయి టీవీలో మాట్లాడాడు.