తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య ఒకేసారి రెండు మూడు చిత్రాలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. మొన్న శుక్రవారం ఒకే రోజు బ్రాండ్ బాబు, చి.ల.సౌ., గూఢచారి చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే చి.ల.సౌ, గూఢచారి చిత్రాలు మంచి పాజిటీవ్ టాక్ వచ్చాయి. తాజాగా గత వారం విడుదలైన 'గూఢచారి' చిత్రంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశంసల జల్లు కురిపించారు.
నిన్న ఈ సినిమాను చూసిన లోకేశ్, రాత్రి 9.16 గంటల ప్రాంతంలో తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. అడవి శేషు, శోభిత ధూళిపాళ హీరోయిన్గా అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీం మర్చెంట్స్ బ్యానర్స్పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అభిషేక్ నామ, టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘గూఢచారి స్ర్పై థ్రిల్లర్ చిత్రం చూసి బాగా ఎంజాయ్ చేశాను.అడవి శేష్, శోభిత ధూళిపాళ, ప్రకాశ్ రాజ్, శశికిరణ్ ఇంకా ఇతర తారాగణం మొత్తం మంచి ఎఫర్ట్ పెట్టారు. వారందరికీ నా అభినందనలు’’ అంటూ నారా లోకేష్ తన ట్విట్టర్లో తన అభిప్రాయం పోస్ట్ చేశారు.
ఈ చిత్రంలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సుప్రియ, రవిప్రకాష్, మధు షాలిని ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర అత్యధిక ధర వెచ్చించి కొనుగోలు చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఆగష్టు ౩న వరల్డ్ వైడ్గా ఈ చిత్రం రిలీజ్ అయి కలెక్షన్లు కూడా బాగా రాబడుతుంది.