ఈ మద్య హ్యాకర్లకు సెలబ్రెటీల అకౌంట్స్ హ్యాక్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇండస్ట్రీలో పలువురు సెలబ్రెటీల ట్విట్టర్, ఫేస్ బుక్ హ్యాక్ చేసి బ్లాక్ మెయిల్ చేయడమే కాదు వారి ఇష్టానుసారంగా పోస్ట్ లు పెట్టి వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇటీవల సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్, అమృత సింగ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాకయ్యాయి. తాజాగా, బాలీవుడ్ సీనియర్ నటి దీప్తి నావల్ కూడా హ్యాకర్ల బాధితుల లిస్టులోకి చేరిపోయారు.
ఇటీవల ఆమెకు హ్యాకర్ల నుంచి మాల్వేర్ స్కాముకు సంబంధించిన ఈమెయిల్ వచ్చింది. ఆమె యూజర్ నేమ్, పాస్వర్డ్లను వెల్లడించిన హ్యాకర్ తనకు కావాల్సిన డబ్బు చెల్లించాలని..తాను అడిగిన మొత్తాన్ని చెల్లించకుంటే ఇంటర్నెట్ బ్రౌజింగ్ హిస్టరీ మొత్తాన్ని బయటపెడతానని బెదిరించాడు. తనకు 5,600 డాలర్ల (రూ.3.9 లక్షలు)ను బిట్ కాయిన్ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశాడు.
ఇందుకోసం 24 గంటల గడువు విధించాడు. ఆలోపు చెల్లించకుంటే బ్రౌజింగ్ హిస్టరీని బహిర్గతం చేస్తానని హెచ్చరించాడు. దాంతో దీప్తి వెంటనే పోలీసులను ఆశ్రయించింది..కానీ వారు మాత్రం ఇది ట్రాష్ అంటూ కొట్టి పడేస్తున్నారు. ఆ ఈమెయిల్ను పట్టించుకోవద్దని పోలీసులు తనకు సూచించారని తెలిపారు. కాగా, ఇటువంటి మెయిలే దాదాపు 20 మందికి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు.