భరత్ అనే నేను సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతుంది. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. అంతేకాదు సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో అల్లరి నరేష్ నటిస్తున్నాడు.


ఆగష్టు 9న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని తెలుస్తుండగా నిన్నటి నుండే ఈ సినిమాకు సంబందిచిన ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా ఏంబ్లం వదలగా ఇప్పుడు ఆ సినిమా టైటిల్ కు హింట్ ఇస్తూ ఆర్.ఐ.ఎస్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు.


తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమా టైటిల్ గా రిషి అని పెట్టబోతున్నారట. ముందు ఈ సినిమాకు రాజసం అన్న టైటిల్ అనుకున్నారని ప్రచారంలో ఉంది. మరి రాజసంలో ఆర్ అయితే ఉంది కాని టైటిల్ మారింది. మహేష్ 25వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో సోషల్ మెసేజ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. 


దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో వస్తుంది. భరత్ సక్సెస్ తర్వాత కథల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్న మహేష్ తన 25వ సినిమా కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా ఉండేలా చేస్తున్నాడట. మరి ఈ సినిమా టైటిల్ ఎదై ఉంటుందో సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: