మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు చుట్టుముట్టుతున్నాయి.  మొదట టెక్నీషియన్స్ తో మొదలైన ఈ గోల ఈ మద్య షూటింగ్ సెట్స్ వరకు కొనసాగుతూ వస్తుంది.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాణ సారథ్యంలో స్వతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటులు అమితాబచ్చన్ నటిస్తున్నారు.  అంతే కాదు వివిధ భాలష హీరోలు విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్ లాంటి స్టార్లు నటిస్తున్నారు. 
Image result for saira narasimha reddy
అయితే ఈ చిత్ర షూటింగ్ రంగస్థలం సెట్స్ లో కొనసాగుతుండగా రెవెన్యూ అధికారలు నిలిపి వేశారు.  అనుమతి లేకుండా సెట్ వేశారని చెబుతూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెట్ కూల్చివేత వివాదాస్పదమైంది.  దాంతో షూటింగ్ కి కొంత గ్యాప్ వచ్చింది. ఈ వివాదం తేలే వరకు ఆగితే సినిమా విడుదల ఆలస్యం అవుతుందని, నిర్మాత నష్టపోవాల్సి వస్తుందని భావించారు. 

ఈ నేపథ్యంలో షూటింగ్ స్పాట్ వేరొకచోటికి మార్చి అక్కడే కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. కొత్త సెట్‌లో నెలరోజులపాటు ఏకధాటిగా షూటింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సెట్‌లోనే బ్రిటిషర్లతో సైరా నరసింహారెడ్డికి మధ్య జరిగే పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం.  అంతా ఓకే అయితే ఈ నెల 22 న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి సిద్దం అవుతున్నట్లు సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: