తమిళ ఇండస్ట్రీలో ఆ మద్య సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం రోబో. రజినీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో భారత దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో సైతం రికార్డుల మోత మోగించింది. 2010లో విడుదలైన ఈ సినిమా తెలుగులో 'రోబో'గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దర్శకుడిగా శంకర్, హీరోగా రజినీకాంత్ ఒక్క సక్సెస్ చూడలేదు.
తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో రోబో సీక్వెట్ రోబో 2.0 వస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా..కొన్ని టెక్నికల్ కారణాల వల్ల పలుమార్లు పోస్ట్ అవుతూ వచ్చింది. అయితే ఈ చిత్రం టీజర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఇదిలా ఉంటే..అయితే, 'యందిరన్' కథ తనదేనంటూ తమిళనాథన్ అనే దర్శకుడు కోర్టులో కేసు వేశారు. ఈ నేపథ్యంలో, శంకర్ కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి తలెత్తింది. కాగా తమిళనాథన్ చెబుతున్న కథకు తన చిత్రానికి చాలా వ్యత్యాసం ఉందని..ఆయన పిటీషన్ లో పేర్కొన్నట్లు సమాచారం.