తమిళ ఇండస్ట్రీలో ఆ మద్య సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం రోబో.  రజినీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో భారత దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో సైతం రికార్డుల మోత మోగించింది.   2010లో విడుదలైన ఈ సినిమా తెలుగులో 'రోబో'గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దర్శకుడిగా శంకర్, హీరోగా రజినీకాంత్ ఒక్క సక్సెస్ చూడలేదు. 
Image result for director shanker
తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో రోబో సీక్వెట్ రోబో 2.0 వస్తున్న విషయం తెలిసిందే.  వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా..కొన్ని టెక్నికల్ కారణాల వల్ల పలుమార్లు పోస్ట్ అవుతూ వచ్చింది.  అయితే ఈ చిత్రం టీజర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. 
Related image
ఇదిలా ఉంటే..అయితే, 'యందిరన్' కథ తనదేనంటూ తమిళనాథన్ అనే దర్శకుడు కోర్టులో కేసు వేశారు. ఈ నేపథ్యంలో, శంకర్ కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి తలెత్తింది.  కాగా తమిళనాథన్ చెబుతున్న కథకు తన చిత్రానికి చాలా వ్యత్యాసం ఉందని..ఆయన పిటీషన్ లో పేర్కొన్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: