ఈ మద్య కొంత మంది సెలబ్రెటీలు సెల్ఫీ ఫోటోలతో సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు. అయితే కొన్ని సార్లు ఆ సెల్ఫీ ఫోటోలు చిక్కులు తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ కన్నడ నటి తీసుకున్న ఫోటోలు ఇప్పుడు ఆమెను చిక్కుల్లో పడేలా చేశాయి. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ కన్నడ హీరోయిన్ నిధి మైసూర్ ప్యాలెస్లో ఫోటోలు తీయించుకోవడంతో పెద్ద వివాదం అయ్యింది.
శాండిల్వుడ్తోపాటు టాలీవుడ్, బాలీవుడ్ లలో పలు చిత్రాల్లో నటించింది. అయితే, మైసూర్ ప్యాలెస్లో ఫోటోలు తీయడం నిషేధం అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకు భిన్నంగా హీరోయిన్ నిధి మైసూర్ ప్యాలెస్లో ఫోటోలు దిగడమే కాకుండా.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఆమెపై నెటిజన్లు సైతం విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
అయితే తాను మాత్రం ఆ ఫోటోలు స్పెషల్ గా తీయించుకోలేదని..అందరు టూరిస్టుల మాదిరిగానే తాను ఫోటోలు తీయించుకున్నానని నిధి తెలిపింది. మరో వైపు ప్యాలెస్లో ఫోటోలు తీసుకోవడంపై నిషేధం లేదని, దసరా, నవరాత్రుల సమయంలో మాత్రమే ఫోటోలపై నిషేధం విధిస్తామని అక్కడి భద్రతా అధికారులు చెబుతున్నారు.