రాజకీయ దిగ్గజం, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు 'కలైంజర్' కరుణానిధి తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తమిళ‌నాడు ప్రియ‌త‌మ నేత కరుణానిధి మృతి ప‌ట్ల త‌మిళ సినీ పరిశ్ర‌మ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది.

కోలీవుడ్‌కి చెందిన టాప్ స్టార్స్ ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్, విశాల్ అజిత్ ,ధనుష్‌, సూర్య త‌దిత‌రులు రాజాజీహాల్‌లో ఉన్న కరుణానిధి పార్ధివదేహాంపై పుష్ప‌గుచ్చం ఉంచి నివాళులు అర్పించారు.
Image result for రజినీకాంత్ కరుణానిధి
‘‘నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని బ్లాక్ డే ఈరోజు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అంటూ రజినీకాంత్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఎంకే స్టాలిన్, కనిమొళితో పాటు కరుణానిధి కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. కరుణానిధి మృతికి సంతాపంగా సినిమా షూటింగ్‌ల‌తో పాటు థియేట‌ర్స్ అన్ని మూత‌ప‌డ్డాయి.  ఈ రోజు సాయంత్రం 4గం.ల‌కి కరుణానిధి అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: