తెలుగు ఇండస్ట్రీలో యువ హీరో నాగశౌర్య మంచి ఫామ్ లో ఉన్నాడు. ‘ఛలో' చిత్రం హిట్ తరువాత వైవిధ్యభరితమైన మరో కథ కోసం వెయిట్ చేసిన నాగశౌర్య, తన సొంత బ్యానర్లోనే 'నర్తనశాల' చిత్రంలో నటించాడు. లెజెండరీ చిత్రమైన ‘నర్తనశాల’ పేరు నిలబెట్టేలా తమ చిత్రం ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది.
శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగశౌర్య సరసన కశ్మీర పరదేశి .. యామిని భాస్కర్ నటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా .. వినోదమే ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తమ బ్యానర్లో వస్తోన్న ఈ చిత్రం తనకి మరో హిట్ ను ఇస్తుందనే ఉద్దేశంతో నాగశౌర్య వున్నాడు.
చిన్నప్పటి నుంచి ఆడపిల్లలా పెంచబడిన హీరో .. అమ్మాయిలకి దూరంగా ఉంటూ వుంటాడు. ఫలితంగా చోటుచేసుకునే సరదా సన్నివేశాలతో ఈ చిత్రం కొనసాగుతుందనే విషయం టీజర్ వలన స్పష్టమవుతోంది. ఇక కథానాయికలిద్దరూ కూడా ఈ చిత్రం తమ కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందనే ఆశాభావంతో వున్నారు.