సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ రాశి ఖన్నాలు నటించిన 'శ్రీనివాస కళ్యాణం' దిల్ రాజ్ కు బాగా కలిసి వచ్చిన ‘బొమ్మరిల్లు’ సెంటిమెంట్ తో రేపు చిత్రం ఆగస్టు 9న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రమోషన్ కు సంబంధించి జరిగిన మీడియా సమావేశంలో దిల్ రాజ్ ఈసినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను వివరిస్తూ  రాశీ ఖన్నా రెమ్యూనరేషన్ విషయంలో జరిగిన ఒక ఆసక్తికర టార్చర్ ను బయట పెట్టాడు.
 అక్కడ వద్దు బాబోయ్ అనుకున్నా, కానీ అదిరిపోయింది: నితిన్
రాశీ ఖన్నా ఈమూవీలో నటించాలని తన పై ఒత్తిడి చేసేందుకు తన మేనేజర్ ను తన ఆఫీసులో కూర్చో పెట్టి ఫోన్స్ మీద ఫోన్స్ చేస్తూ తన మేనేజర్ ద్వారా రాశి తనను చాల టార్చర్ పెట్టిందని అంటూ జోక్ చేసాడు దిల్ రాజ్. చివరికి ఏదోలా ఆమె ఈమూవీలో నటించడం ఫైనల్ అయిన తరువాత కొద్దిగా పారితోషికం తగ్గించుకోమని తాను అడిగినా ఆవిషయం కూడ వినకుండా తన మేనేజర్ ద్వారా తిరిగి తన పై ఒత్తిడి చేసి అన్ని విషయాలలోనూ తన మాటను రాశి ఖన్నా నెగ్గించుకుంది అంటూ ఆమె పెట్టిన స్వీట్ టార్చర్ బయటపెట్టాడు దిల్ రాజ్.
రాశీ చెత్తగా ఉందని తిట్టుకుంది: నితిన్
ఇదే సందర్భంలో హీరో నితిన్ రాశి ఖన్నా గురించి మాట్లాడుతూ ‘మొదలవుదాం తొలి ప్రేమగా..అపుడో ఇపుడో ఎపుడైతేనేం కొత్తగా' అనే సాంగ్ చిత్రీకరణ కోసం తాము అరకు వెళ్ళినప్పుడు జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు. ఈ సాంగ్ ట్యూన్ విని ఇదేం పాట, ట్యూన్ ఏం బాగోలేదని రాశి తిట్టుకున్న విషయాన్ని బయటపెడుతూ ఇప్పుడు ఆపాట తనకు నచ్చింది అంటూ మీడియా ఇంటర్వ్యూలో సందడి చేస్తున్న రాశి తెలివి తేటలు తనకు లేవు అంటూ జోక్ చేసాడు. 
రాశీ ఖన్నా మేనేజర్ టార్చర్ పెట్టాడు: దిల్ రాజు
ఈమూవీ క్లైమాక్స్ సీన్ చూసిన తర్వాత తాను ఏడుస్తూ సతీష్ వేగేశ్న కాళ్లు మొక్కిన సందర్భాన్ని రాశి ఖన్నా వివరిస్తూ ఇప్పటి వరకు తన జీవితంలో ఏదర్శకుడు కాళ్ళను మొక్కలేదు అన్న విషయాన్ని చెపుతూ ఈమూవీ పై విపరీతంగా అంచనాలు పెంచుతోంది రాశి. ఈమూవీ క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ నితిన్ ల మధ్య వచ్చే సంభాషణలు ఈమూవీ సక్సస్ కు అత్యంత కీలకంగా మారుతాయి అని వార్తలు వస్తున్న నేపధ్యంలో రేపు విడుదల కాబోతున్న ఈమూవీ గ్యారెంటీ హిట్ అన్న ప్రచారం జరుగుతోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: