మారుతి దర్శకత్వంలో నాగచైతన్య .. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా రూపొందుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా, ఇప్పటికే టాకీపార్టును పూర్తి చేసుకుంది.  అల్లుడు మరో ఇరవై రోజుల్లో విడుదలకు రెడీ అవుతోంది. ఒక పక్క సినిమా పూర్తయిపోయి, పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆల్ మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చింది. అయితే ఒక పాటను ఆది నుంచీ వెనక్కు పెట్టారు.  ఇప్పుడు సినిమా దాదాపు ఫినిష్ అయిపోయింది కాబట్టి, ఆ పాట పూర్తి చేసే పనిలో ఉన్నారు.  ప్రస్తుతం ఆ పాటను 'గోవా'లో చిత్రీకరిస్తున్నారు. 

Image result for shailaja reddy alludu

మూడు రోజులుగా కొనసాగుతోన్న పాట చిత్రీకరణ ఈ రోజుతో పూర్తి కానున్నట్టు చెబుతున్నారు. ఈ పాట చాలా రొమాంటిక్ గా ఉంటుందనీ .. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. వాస్తవానికి  ఈ పాట కోసం క్రాబ్స్ ఐలాండ్ ను మాంచి స్పాట్ గా ఎంచుకున్నారు. కానీ టైమ్ సరిపోతుందో లేదో? లాస్ట్ మినిట్ టెన్షన్ ఎందుకు అని గోవాతో సరిపెట్టేసుకుంటున్నారు. 


ఈనెల 10 నుంచి ఒక్కో సాంగ్ వన్ మినిట్ టీజర్లు, అలాగే దగ్గర చేసి ట్రయిలర్, ఇంకా విడుదల దగ్గరగా మేకింగ్ వీడియో, ఈ టైమ్ లోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాంటి హడావుడులు వుంటాయి.  ఇదిలా ఉంటే.. 'శైలజా రెడ్డి అల్లుడు' సినికు ఒక్కరోజు ముందు నాగశౌర్య నటించిన ‘నర్తనశాల’ రిలీజ్ అవుతుంది. దానికి పబ్లిసిటీ ఓ రేంజ్ లో బీభత్సంగా చేస్తున్నారు. అందుకే శైలజారెడ్డిఅల్లుడు పబ్లిసిటీని కూడా తానే ప్లాన్ చేసి, ఎగ్జిక్యూట్ చేయాలని దర్శకుడు మారుతి ఆలోచిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: