ఆగష్టు 15న విడుదల కాబోతున్న ‘గీత గోవిందం’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఆసినిమా దర్శకుడు పరుశురామ్ అల్లు అర్జున్ అలవాట్లను అదేవిధంగా అతడి వ్యవహార శైలిని బయట పెడుతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. బన్నీకి తాను చెప్పే కథలంటే చాలాఇష్టం అని చెపుతూ అల్లు అర్జున్ కు బోర్ కొట్టినప్పుడల్లా తనను పిలిపించుకుని బన్నీ తనతో కథలు చెప్పించుకుని ఆ కథల పై చర్చలు చేస్తూ ఉంటాడు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
allu
ఇదే సందర్భంలో పరుశురామ్ మాట్లాడుతూ తనకు బన్నీతో తనకు మంచి సంబంధాలున్నాయని చెపుతూ తాను బన్నీకి ఇప్పటి వరకు చాల కథలు చెప్పినా తాను చెప్పిన ఏకథకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అంటూ మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు పరుశు రామ్.  దీనితో ఈ డిరెక్టర్ అల్లు అర్జున్ పై అభిమానంతో ఇలా కామెంట్ చేసాడా లేదంటే తనతో కథలు చెప్పించుకుని వేరే దర్శకులతో సినిమాలు చేస్తున్న బన్నీ విచిత్ర అలవాట్లు చూసి విసిగిపోయి ఇలా అభిప్రాయ పడ్డాడా అంటూ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 

వాస్తవానికి దర్శకుడు పరుశురామ్ కు అల్లు కాంపౌండ్ కు మంచి సంబంధాలు ఉన్న నేపధ్యంలో అల్లు అరవింద్ గతంలో అల్లు శిరీష్ తో ‘శ్రీరస్తు శుభమస్తు’ తీసే అవకాశం ఇచ్చాడు. ఆసినిమా పెద్దగా విజయవంతం కాకపోయినా తిరిగి విజయ్ దేవర కొండతో ‘గీత గోవిందం’ తీసే ఛాన్స్ పరుశురామ్ కు అరవింద్ ఇచ్చాడు. ఇలాంటి పరిస్థుతులలో అల్లు కాంపౌండ్ టాప్ హీరో బన్నీని టార్గెట్ చేస్తూ ఇలా ఎందుకు పరుశురామ్ కామెంట్ చేసాడు అంటూ చాలామంది ఆశ్చర్య పోతున్నారు. 
Allu Arjun
ఈమధ్య కాలంలో తన దగ్గరకు వస్తున్న దర్శకుల పట్ల అల్లు అర్జున్ వ్యవహరిస్తున్న తీరుతో ప్రస్తుతం చాలామంది బన్నీతో సినిమా అంటేనే భయపడిపోతున్నారు. ఇలాంటి అనుభవాలు పరుశురామ్ కు కూడ కలగడంతో ఇలా అనుకోకుండా పరుశురామ్ అల్లు అర్జున్ విచిత్ర అలవాట్లను బయటపెట్టాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: