తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటికి 50 ఎపిసోడ్స్ దాటి ముందుకు సాగుతుంది.  అయితే ఇప్పటి వరకు ఎలిమినేషన్ అయిన వారిలో సంజన,కిరీటి,భానుశ్రీ,తేజస్వి,నందినిలు ఉన్నారు.  అయితే గతంలో ఎలిమినేషన్ అయిన వారిలో నూతన్ నాయుడు, యాంకర్ శ్యామలను మరోసారి ఓటింగ్ పద్దతి ద్వారా తిరిగి బిగ్ బాస్ హౌజ్ లోకి తీసుకున్నారు.  అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌజ్ లో కౌశల్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న వారి ‘కౌశల్ ఆర్మి’టార్గెక్ కి బలి అవుతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇందులో నిజం ఎంత ఉందో లేదో తెలియదు కానీ..ఈసారి కౌశల్ ని మొదటి నుంచి ఇబ్బంది పెడుతున్న బాబు గోగినేనికి ఎసరు వచ్చేలా ఉందని అంటున్నారు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో కౌశల్ కూడా బాబు గోనినేనిపై ఎంతో అసహనంతో ఉన్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ కంటే ఎక్కువ అన్నట్టు బాబు ఫీల్ అవుతున్నారని మండిపడ్డాడు కౌశల్.

ఆయన కంటే ఎక్కువ తెలుసా అని ప్రశ్నించాడు. నూతన్ నాయుడు మధ్యలో కలుగజేసుకుని.. ఆయన్ను మార్చే ప్రయత్నం చేయొచ్చు కదా అని సూచించాడు.  దాంతో కౌశల్ మరోసారి సీరియస్ అవుతూ..మనం ఏమైనా టీచర్లమా..ఆయనకు తెలియదా అని అడిగాడు. యటకు ఏమీ తెలియనట్టు ఉంటున్నా.. లోలోపల ఇద్దరూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: