గతవారం విడుదలైన ‘గూఢచారి’ ఊహించని సక్సస్ ను అందుకోవడంతో ఆమూవీ యూనిట్ సభ్యులు అంతా ఆసక్సస్ ను తెగఎంజాయ్ చేస్తున్నారు. ఈనేపధ్యంలో ఈమూవీ నిర్మాతలు నిన్న ఏర్పాటు చేసిన సక్సస్ మీట్ కు నాగార్జున అతిధిగా వచ్చి రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీని వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ చాలామందిని ఆశ్చర్య పరిచాయి. 
 చిన్నతనంలో అక్కడ నాన్నకు తెలియకుండా బీర్లు కొట్టేవాడిని
బడ్జెట్ పరంగా చూస్తే ‘గూఢచారి’ ‘రంగస్థలం’ కంటే పెద్ద హిట్ అనికామెంట్ చేస్తూ ఒకసినిమా  కలెక్షన్స్ కంటే ఆసినిమా ఆడియన్స్‌లో ఎంత ఇంపాక్ట్ కలిగించిందనేదే ముఖ్యం అనిఅంటూ తన ఉద్దేశ్యాన్ని ఎటువంటి మొహమాటం లేకుండా బయటపెట్టాడు నాగార్జున. అంతేకాదు ప్రస్తుతతరం న్యూజనరేషన్‌ యాక్టర్స్‌ టెక్నీషియన్స్‌ ను చూస్తుంటే తాను ఈతరం ఆలోచనలలో ఎంత వెనుకపడిపోయాను అనేవిషయం అర్ధంఅవుతుంది అనిఅంటూ ఇప్పటి వరకు తాను చేస్తున్న సినిమాలను చూసి తనకు కూడ సినిమా తీయడం తెలియక బద్దకస్తుడిగా మారిపోయానా అంటూ తనపై తానే సెటైర్లు వేసుకున్నాడు నాగార్జున. 
స్టోరీ, రైటింగ్ బావుంది
ఇదే సందర్భంలో నాగార్జున మరో ట్విస్ట్ ఇస్తూ ‘గూఢచారి' సినిమాలో చాలా లొకేషన్లు కొత్తగా చూపించిన విషయాన్ని చెపుతూ 17రోజులు అన్నపూర్ణ స్టూడియోలో ఈసినిమా యూనిట్ తీసిన లోకేషన్స్ ఎక్కడివో తనకే తెలియక ఒకవైపు అనందం మరోవైపు సిగ్గుపడ్డాను అంటూ  తనపై తానే జోక్ చేసుకున్నాడు నాగార్జున. అంతేకాదు అన్నపూర్ణ స్టూడియోను ‘గూఢచారి' టీమ్ వాడినట్లు ఎవరూ వాడిఉండరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 
ఈ ఏడాది ఈ మూడు సినిమాలే
ఒక సెన్స్ బుల్ సినిమాను కమర్షియల్ గా తీయడం చాలాకష్టం అని చెపుతూ ఈచిత్రం విషయంలో దర్శకుడి ప్రతిభను ప్రశంసిస్తూ సినిమాలు ఊరికే ఆడవు అనిఅంటూ ఈసంవత్సరం అంతా తిప్పితిప్పి కొడితే మూడు సినిమాలు మాత్రమే రియల్ సుపర్ హిట్ అనిఅంటూ వాటిలో ‘మహానటి’ ‘రంగస్థలం’ ‘గూఢచారి’ సినిమాలను పేర్కున్నాడు. అయితే తాను ‘రంగస్థలం', ‘మహానటి' సినిమాలను తక్కువచేసి మాట్లాడటం లేదని బడ్జెట్ లిమిటేషన్స్ తో పాటు లాభాల శాతాన్ని పరిగణంలోకి తీసుకుని తాను ఈకామేంట్ చేసాను అంటూ తనమాటలను సద్దిచెప్పుకున్నాడు నాగార్జున. ఇప్పటికే చాలామంది టాప్ హీరోలు మారుతున్న ప్రేక్షకుల అభిరుచిని పసిగట్టలేకపొతున్నారు అని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో నాగార్జున లేటెస్ట్ చేసిన కామెంట్స్ అనేక చర్చలకు దారితీస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: