తెలుగు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీర్ మొదటి సారిగా నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. మొదటి సారి వీరి కాంబినేషన్ లో చిత్రం అనగానే అంచనాలు కూడా భారీగానే పెరిగిపోతున్నాయి. టెంపర్ చిత్రం నుంచి వరుసగా హిట్స్ సాధిస్తున్న ఎన్టీఆర్ ఈ చిత్రం మరో ప్రిస్టేజియస్ గా మారింది. ఇక అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తో సతమతమవుతున్న దర్శకులు త్రివిక్రమ్ అచూ తూచీ అడుగులు వేస్తున్నాడు.
ఆ మద్య ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ కావడం పై కూడా దర్శకులు సీరియస్ గా ఉన్న విషయం తెలిసిందే..అందుకూ షూటింగ్ స్పాట్ వద్ద ఎవరికీ ఫోన్ పరిమిషన్ లేకుండా చేశారు. అక్కడ కీలక సన్నివేశాలు, రెండు పాటలు చిత్రీకరించనున్నారు. ఇందులో ఎన్టీఆర్ చిత్తూరు కుర్రాడుగా కనిపించబోతున్నాడు. ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా రాయలసీమ యాసను నేర్చుకుంటున్నాడు. సిక్స్ ప్యాక్లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక నటిస్తుంది.
ప్రస్తుతం హైదరాబాద్లోనే ఈ చిత్రం చిత్రీకరణ జరగుతోంది. మరో కొత్త షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనుంది ఈ చిత్రబృందం. ఇదిలా ఉంటే ఈ చిత్రం దసరా కానుకగా ఇవ్వాలనుకున్నారు..మరి టైమ్ దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు ఒక్క టీజర్ కూడా లేదు. దాంతో అసలు ఈ చిత్రం దసరాకు వస్తుందా రాదా అన్న కన్ప్యూజన్ లో అభిమానులు ఉన్నారు.
అయితే ఆ కన్ఫ్యూజన్ దూరం చేయడానికి చిత్ర యూనిట్ నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తారట. ఇప్పటికే టీజర్ ను కట్ చేసే పనిలో బిజీగా ఉన్నారట మేకర్స్. సో.. ఈనెల పదిహేనవ తేదీన వీర రాఘవుడి సీమ ఉగ్ర రూపం చూడొచ్చన్నమాట. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ చేస్తారని టాక్. తాజా సమాచారం ప్రకారం - టీజర్ రిలీజ్ - చిత్రం రిలీజ్ డేట్లను 'అరవింద సమేత' టీమ్ లాక్ చేసిందట.