టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది యువ హీరోలను పరిచయం చేసి మంచి లైఫ్ ఇచ్చిన దర్శకుడు వివివినాయక్.  మాస్ ఎలిమెంట్స్ తో మంచి కామెడీ, ఫైట్స్, ఎమోషన్స్ తో పాటు మంచి మేసేజ్ తన సినిమాలో చూపిస్తాడు వివివినాయక్.  అందుకే దాదాపు పది సంవత్సరాల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి కావాలనే.. వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో నటించాడు.  ఈ సినిమా మాస్ మసాలతో పాటు రైతులకు మంచి మేసేజ్ తో సూపర్ హిట్ అయ్యింది.  అయితే గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణతో వివివినాయక్ సినిమా వస్తుందని తెగ వార్తలు వచ్చాయి. 
Image result for balakrishna ntr biopic
కాకపోతే ప్రస్తుతం బాలకృష్ణ ప్రముఖ దర్శకులు క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.  క్రిష్ డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతి సమయానికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే మాస్ డైరెక్ట‌ర్ వినాయ‌క్‌తో బాల‌య్య ఓ సినిమా చేయ‌బోతున్నారంటూ వార్త‌లు వచ్చిన సంగ‌తి తెలిసిందే.  మరోవైపు బాలయ్యతో వివివినాయక్ సినిమా లేదని..ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బోయపాటితో సినిమా తీస్తున్నారని వార్తలు వచ్చాయి. 

తాజాగా దర్శకులు వివివినాయక్  ఈ వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చారు. త‌న త‌ర్వాతి సినిమాలో హీరో బాల‌కృష్ణేన‌ని చెప్పారు. హైద‌రాబాద్‌లోని ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వినాయ‌క్‌.. బాల‌య్య కోసం క‌థ సిద్ధం చేస్తున్న‌ట్టు తెలిపారు. ఆ మద్య సాయిధరమ్ తేజ్ తో తీసిన ‘ఇంటెలిజెంట్’ అట్టర్ ఫ్లాప్ తర్వాత వివివినాయక్ ఏ సినిమా కూడా ప్రకటించలేదు.  అయితే బాలయ్యకోసం సీరియస్ గా కథ సిద్దం చేయడం వల్లనే గ్యాప్ వచ్చిందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: