తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున వారసుడిగా అఖిల్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్.  చిన్నతనంలోనే ‘సిసింద్రి’గా వెండి తెరకు పరిచయం అయిన అఖిల్ తర్వాత అక్కినేని కుటుంబ మూడు తరాాలు కలిసి నటించిన ‘మనం’ చిత్రంలో క్లయిమాక్స్ లో తళుక్కున మెరిసాడు.  ఆ తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు.  అయితే ఈ చిత్రం కథా పరంగా బలహీనంగా ఉండటంతో ఫ్లాప్ టాక్ వచ్చింది.  కాకపోతే అఖిల్ చిత్రంలో హీరో అఖిల్ కి మాత్రం మంచి పేరు వచ్చింది. 


డ్యాన్స్, ఫైట్స్ లో ఈ తరం కుర్రాడికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు.  ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘హాలో’ చిత్రంతో వచ్చాడు..ఈసారి లవర్ బాయ్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.  కాకపోతే ఈ చిత్రం కమర్షియల్ హిట్ కాలేక పోయింది.  తాజాగా  దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు.  . నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం లండన్ లో షూటింగ్ జరుపుకుంటుది.  ప్రస్తుతం ప్రధాన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ వస్తున్నారు.

Image result for akhil atluri

ఆ మద్య  ఈ చిత్రానికి  'మిస్టర్ మజ్ను' అనే టైటిల్  ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అదే టైటిల్ ను ఖరారు చేశారనీ .. రిజిస్టర్ కూడా చేయించారనేది తాజా సమాచారం. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ తన అందాలతో మురిపించబోతుందట..తమన్ మ్యూజిక్ మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందట. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: