మళయాల హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషల్లో తన హవా కొనసాగిస్తుంది. మహానటి సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు తన మంచితనంతో పాటుగా అందరి మనసులను గెలుచుకుంటుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ సండై కోళి-2 లో నటిస్తుంది. లింగుస్వామి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో విశాల్ హీరోగా నటిస్తున్నాడు.


2005లో వచ్చిన సండై కోళి సంచలన విజయం అందుకుంది. ఈ సినిమా సీక్వల్ గా సండై కోళి-2 చేస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. విశాల్ సరసన కీర్తి సురేష్ తో పాటుగా వరలక్ష్మి కూడా ఈ సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ తన పార్ట్ పూర్తి చేసుకున్న కీర్తి సురేష్ చిత్రయూనిట్ అందరికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చిందట. 


మహానటి సినిమా టైంలో కూడా కీర్తి చిత్రానికి పనిచేసిన యూనిట్ అందరికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చిందని టాక్. ఇలా చేస్తున్న అమ్మడు బంగారం లాంటి మనసున్న అమ్మాయి అంటూ చిత్రయూనిట్ నుండి ప్రశంసలు అందుకుంటుంది. అంత మంచి మనసు ఉంది కాబట్టే చేస్తున్న సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి.


మహానటి తర్వాత తెలుగులో ఇంకా ఏ సినిమా కన్ఫాం చేయని కీర్తి సురేష్ తమిళంలో మాత్రం విజయ్, విశాల్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది. విశాల్ తో చేస్తున్న సండై కోళి-2 మాత్రం మరో హిట్ ఖాతాలో వేసుకున్నట్టే. ఈ సినిమా తెలుగులో పందెం కోడి-2 గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: