పూరి తనయుడిగా హీరోగా ఆంధ్రా పోరి సినిమా చేసిన ఆకాష్ పూరి రీసెంట్ గా పూరి జగన్నాథ్ డైరక్షన్ లో మెహబూబా సినిమా చేశాడు. ఆ సినిమా అంచనాలను అందుకోలేదు. పూరి కాస్త పంథా మార్చినట్టు అనిపించినా సినిమా మాత్రం సక్సెస్ అవలేదు. మెహబూబా సినిమా ఆడియో ఫంక్షన్ లో పూరి తనయుడితో మరో మూడు సినిమాలు చేస్తున్నట్టు ప్రకటించాడు.


అయితే ప్రస్తుతం ఆ ప్రయత్నాలు మానుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఆకాష్ పూరి హీరోగా బయట దర్శకుడు సినిమా చేస్తున్నాడట. ఈ సినిమాకు అరణ్యం టైటిల్ పెట్టారట. ఆదిత్య ఇమంది డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను అశోక్ నాయక్ నిర్మిస్తున్నారు. అడవి ప్రాంతంలో రోడ్ జర్నీగా రాబోతున్న ఈ సినిమా థ్రిల్లర్ గా తెరకెక్కుతుందట.


ఆకాష్ పూరి చేస్తున్న ఈ ప్రయత్నం ఎలా ఉండబోతుందో చూడాలి. మెహబూబాతో తన సత్తా చాటుకున్న ఆకాష్ పూరి ఈసారి ఓ క్రేజీ అటెంప్ట్ తో రాబోతున్నాడు. యువ హీరోలంతా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తుంటే ఆకాష్ వారిలో తను కూడా ఒకడిగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.


పూరి హిట్ ట్రాక్ లో ఉంటే ఆ లెక్క వేరేలా ఉండేది కాని ప్రస్తుతం పూరి ఏమాత్రం ఫాంలో లేడు అందుకే ఆకాష్ పూరి కెరియర్ రిస్క్ లో పడ్డది. మరి అరణ్యంతో అయినా ఆకాష్ లక్ కలిసి వస్తుందేమో చూడాలి. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో వెళ్లడిస్తారట.  



మరింత సమాచారం తెలుసుకోండి: