తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో నిన్న కెప్టెన్సీ టాస్క్ చాలా హడావుడిగా నడిచింది. బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్ రేస్లో నామినేట్ అయిన తనీష్, దీప్తిలకు ‘రంగు రబ్బా.. రబ్బా’ టాస్క్ ఇవ్వడం, ఈ టాస్క్లో సంచాలకురాలుగా దీప్తి సునయన వ్యవహరించారు. గేమ్ ప్రారంభం కాకుముందే ఖచ్చితంగా సునయన తనీష్ను విన్నర్గా ప్రకటిస్తుందని భావించారంతా. అందరూ భావించినట్టుగానే తనీష్ను ‘రంగు రబ్బా.. రబ్బా’ గేమ్లో విన్నర్గా ప్రకటించింది సంచాలకురాలు దీప్తి సునయన. వాల్కి పెయింగ్ వేయడంలో తనీష్కి గట్టిపోటీ ఇచ్చింది దీప్తి.
వాస్తవానికి తనీష్ ఎరుపు రంగు సెలక్ట్ చేసుకోవడంతో దీప్తి ఎంచుకున్న బ్లూకలర్ని డామినేట్ చేసింది. దీప్తి ఎంతగా ప్రయత్నించిన ఎరుపు రంగు డామినేషన్ కారణంగా వాల్ పై బ్లూ కలర్ కనిపించలేదు. ఇదిలా ఉంటే..అమ్మాయి అని చూడకుండా తనిష్ దీప్తిని ఫిజికల్ గా కూడా అడ్డుకున్నాడు. దాంతో ఓటమిని ఒప్పుకోక తప్పలేదు.
మరోవైపు ఎన్ని కలర్ ఉన్నా ఎరుపు రంగు కలర్ డామినేషన్ ఉంటుంది కాబట్టి.. ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకుని నిర్ణయాన్ని చెప్పాలని సంచాలకురాలు దీప్తి సునయనకు రిక్వెస్ట్ చేశారు కౌశల్. కానీ మొండిగా తనకు ఇష్టమైన తనిష్ కే ఓటు వేసి కెప్టెన్సీని చేసింది దీప్తి సునయన. మగాళ్లు ఆడవాళ్లకు మధ్య గేమ్ ఏంటి? ఫిజికల్ గేమ్లు పెట్టి గెలవమంటే ఎలా అంటూ కెప్టెన్ టాస్క్లో ఓడిపోయిన దీప్తి కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పుడు నేను ఏడిస్తే.. ఓడిపోయిన ప్రతిసారి నా కొడుకు ఏడుస్తాడంటూ తనను తాను సముదాయించుకుని బాధపడింది.