తెలుగు లో ‘నేను శైలజ’సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ లో అచ్చమైన తెలుగు అమ్మాయిగా అందరి మనసు దోచింది.  ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’సినిమాతో తెలుగు, తమిళంలో తిరుగులేని స్టార్ డమ్ తెచ్చుకుంది.   మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ లీనమైందనీ..ఆ పాత్రకు జీవిం పోసిందని విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.  ఒకప్పుడు పున్నమినాగు సినిమాలో చిరంజీవి సరసన నటించిన అలనాటి హీరోయిన్ మేనక కూతురు అయిన కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా విజయాలు సాధిస్తూ వస్తుంది.

తాజాగా ఈ భామ విశాల్‌తో క‌లిసి లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో సండైకోళి2లో న‌టిస్తోంది. విశాల్‌, మీరాజాస్మిన్ న‌టించిన సండైకోళి(తెలులో పందెం కోడి) సీక్వెల్‌గా రూపొందుతోంది.  ఒకప్పుడు సావిత్రి తన సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత యూనిట్ సభ్యులకు ఏదో ఒక బహుమానం ఇవ్వడం అలవాటు.  ఇప్పుడు ఇదే పద్దతి పాటిస్తుంది కీర్తి సురేష్. 
Image result for sandai koli 2
మామూలుగా చిత్ర యూనిట్‌తో  మంచి అనుబంధం ఉన్న‌ప్పుడు హీరో, హీరోయిన్లు చిత్ర యూనిట్ అంద‌రికీ ఏదో ఒక బ‌హుమ‌తి ఇవ్వ‌డం త‌మిళ‌నాట ఆన‌వాయితీ. విజ‌య్‌, అజిత్ అయితే చిత్ర యూనిట్‌కి గిఫ్ట్ లు ఇవ్వ‌డంతో పాటు ఒక‌రోజు బిర్యానీని కూడా వ‌డ్డిస్తారు.

తాజాగా కీర్తి సురేష్ సండైకోళి2 చిత్ర యూనిట్‌కు గోల్డ్ కాయిన్స్ పంచిపెట్టార‌ట‌. దాంతో చిత్ర యూనిట్ కీర్తి సురేష్ కి మంచి భవిష్యత్ ఉండాలని దీవించారట. ఏది ఏమైనా బంగారం ఎప్ప‌టికైనా బంగార‌మే క‌దా అని అమె ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: