ప్రముఖ సౌత్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ త్వరలో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ తో కోలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నటవారసుడు ఇంకా తన తొలి మూవీ విడుదల కాకుండానే మీడియాకు హాట్ టాపిక్ గా మారాడు. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఇతడు నిన్న తన కారుతో చెన్నై రోడ్ల పై సృష్టించిన వీరంగం కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 

 మితిమీరిన వేగంతో ధృవ్ రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి కారణమయ్యాడు అని తెలుస్తోంది. ఈ ఘటనతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి అని తెలుస్తోంది. ఈ యాక్సిడెంట్‌ లో అతడితో పాటు ముగ్గురు కలిసి ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్సిడెంట్ జరిగే సమయంలో ధృవ్ తన లగ్జరీ కారులో మితిమీరిన వేగంతో ప్రయాణించినట్లు వార్తలు వస్తున్నాయి. 
Dhruv Vikram releases his first short film in YouTube
మీడియా వర్గాలలో వస్తున్న వార్తల ప్రకారం తైనంపేట్ పోలీస్ కమీషనర్ ఇంటి సమీంలోకి వచ్చిన తర్వాత ద్రువ్ కారు మితిమీరిన వేగంతో అదుపు తప్పడంతో వేగంగా వెళుతూ అక్కడ రోడ్డు పక్కన నిలిచిన ఆటోరిక్షాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో నిద్రిస్తున్న ఆటో డ్రైవర్ తో పాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పాండీ బజార్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ధృవ్ కారు స్వాధీనం చేసుకోవడంతో పాటు అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 

ధృవ్ నటిస్తున్న ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ కు ‘వర్మ’ అన్నపేరు పెట్టారు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ దశలో ఉంది. రెబల్ పాత్రతో కూడిన సినిమాను చేస్తున్న పరిస్థుతులలో ఆపాత్ర స్వభావం పూర్తిగా తలకెక్కడంతో ధృవ్ తన సినిమా విడుదల కాకుండానే ఇలా సంచలనాలు క్రియేట్ చేస్తున్నాడను కోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: