తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ వచ్చాడు.  ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత రాంచరణ్ నటించినవి చాలా తక్కువ చిత్రాలే అయినా..దాదాపు అన్ని మంచి విజయాలు సాధించాయి.  సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ సూపర్ డూపర్ హిట్ కావడమే కాదు..రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది.  ప్రస్తుతం మాస్ దర్శకులు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో యాక్షన్, ఎంట్రటైన్ మెంట్ చిత్రంలో నటిస్తున్నాడు. 
Image result for yevadu movie
ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు..ఎలాంటి అప్ డేట్స్ కూడా బయటకు రాకుండా చాలా సీక్రెట్ గా మెయింటేన్ చేస్తున్నారు.  కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. అయితే ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ ల మల్టీస్టారర్ చిత్రం ప్రారంభం అవుతుందని తెలిసిందే. 
Image result for boyapati srinvas ram charan
ఈ చిత్రం పూర్తి కాగానే వెంటనే వంశీ పైడిపల్లిని లైన్లో పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య ఇటీవల చర్చలు జరిగినట్టుగా సమాచారం. ప్రస్తుతం వంశీ పైడిపల్లి మహేశ్ తో 'మహర్షి' చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఎవడు' భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: