‘శ్రీనివాస కళ్యాణం’ ఊహించిన సక్సస్ ను అందుకోలేక పోవడంతో షాక్ కు గురైన దిల్ రాజ్ భవిష్యత్ లో తాను ఇక ఫ్యామిలీ సినిమాల జోలికి పోను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు దిల్ రాజ్. 
నితిన్ కంటే ముందు తారక్, చరణ్‌లకు కథ చెప్పాం
గత ఏడాది సంచలన విజయం సాధించిన ‘శతమానం భవతి’ సినిమా కథను సాయి ధరమ్ తేజ్ ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ వ్రాయిస్తే ఆమూవీలో నటించడానికి తేజ్ ఆసక్తి కనపరచకపోవడంతో శర్వానంద్ వచ్చి చేరిన విషయాన్ని బయటపెట్టాడు. ఇక ‘శ్రీనివాస కళ్యాణం’ కథను నితిన్ ను దృష్టిలో పెట్టుకుని వ్రాయలేదని ఈకథకు జూనియర్ హీరోగా సరిపోతాడు అన్న ఉద్దేశ్యంతో కథ వ్రాయించి జూనియర్ కు ‘శ్రీనివాస కళ్యాణం’ కథ చెపితే ఆకథ విని ఏమి మాట్లాడకుండా జూనియర్ తన నిర్ణయాన్ని దాటవేసిన విషయాన్ని బయట పెట్టాడు దిల్ రాజ్.
సక్సెస్ వస్తే కోట్లు పట్టుకుని వస్తారు
అయితే అప్పటికే పూర్తి స్క్రిప్ట్ తయారు కావడంతో నితిన్ ను హీరోగా తీసుకున్న విషయాన్ని వివరిస్తూ కనీసం కథ కూడ అడగకుండా నితిన్ ఈసినిమాలో హీరోగా సెటిల్ అయిన విషయాన్ని వివరించాడు. ఇదే సందర్భంలో దిల్ రాజ్ మాట్లాడుతూ ప్రస్తుతతరం అభిరుచులలో వచ్చిన మార్పులు వల్ల ఇక రానున్న రోజులలో ఫ్యామిలీ సినిమాలు తీసి చేతులు కాల్చుకునే ప్రయత్నాలు ఎవరు చేయరు అంటూ వ్యూహాత్మకంగా  కామెంట్ చేసాడు దిల్ రాజ్.
 తారక్ మళ్లీ ఫోన్ చేయలేదు
వరసపెట్టి సినిమాలు తీస్తున్న దిల్ రాజ్ కు పరాజయాలు కొత్తవి కాకపోయినా ‘శ్రీనివాస కళ్యాణం’ పై అతడు పెట్టుకున్న అంచనాలు రివర్స్ కావడంతో ఏర్పడ్డ షాక్ నుండి దిల్ రాజ్ ఇప్పటికీ కోలుకోలేక పోతున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజ్ చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే సాయి ధరమ్ తేజ్ మంచి సక్సస్ ను మిస్ చేసుకుంటే జూనియర్ ఒక భారీ ఫ్లాప్ నుండి తప్పించుకున్నాడని అనిపిస్తుంది. అందువల్లనే సినిమాల కథల ఎంపికలో ఏమాత్రం పొరపాటు జరిగినా ప్రస్తుత తరం హీరోలు భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: