టైటిల్ చూసి కాస్త కన్ ఫ్యూజ్ అయి ఉండొచ్చు.. స్టార్ క్రేజ్ లో పవన్, ఎన్.టి.ఆర్ ఎవరికి వారు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. వీరి సినిమాల ఫలితాలు వాటి రికార్డులు కూడా అందరికి తెలిసిందే. ఇక త్రివిక్రంతో ఈ ఇద్దరు తీసే సినిమా ద్వారా ఇద్దరు సేమ్ టూ సేమ్ అనేలా చేస్తుంది. 


ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే పవన్ త్రివిక్రం కాంబినేషన్ లో 3 సినిమాలు వచ్చాయి. జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి. ఈ మూడు సినిమాల్లో అజ్ఞాతవాసి తప్ప మిగతా రెండు హిట్ అయ్యాయి. ఇక ప్రస్తుతం త్రివిక్రం ఎన్.టి.ఆర్ సినిమా చేస్తున్నాడు. అరవింద సమేత అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.


ఇక ఈ సినిమా నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్ పవన్ అజ్ఞాతవాసి తరహాలో ఉండటం అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. టీజర్ టైం చెబుతూ వచ్చిన అరవింద సమేత ఎన్.టి.ఆర్ పోస్టర్ షాడోలో షాక్ ఇచ్చాడు. అంతేకాదు ఎన్.టి.ఆర్ కూడా కుర్చిలో స్టైల్ గా కూర్చున్నాడు. త్రివిక్రం ఆడుతున్న ఈ కుర్చీలాట ఏంటో తెలియదు కాని పవన్ అజ్ఞాతవాసిలో కుర్చి మీద డైలాగ్ కూడా అదిరిపోతుంది.  


ఇప్పుడు అదే కుర్చిలో ఎన్.టి.ఆర్ కూర్చుని కనిపించాడు. త్రివిక్రం మార్క్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పవన్ సేమ్ టూ సేమ్ అనేలా చేస్తున్నాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: